ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అమ్మాయిలు సరికొత్త చరిత్రను సృష్టించారు. ఒకవైపు పురుషుల విభాగంలో అబ్బాయిలందరూ వెనుదిరిగి వస్తుంటే.. మహిళలు మాత్రం స్వర్ణాలతో మెరవకపోయినా కాంస్య, రజత పతకాలతోనే భారతదేశ గౌరవాన్ని కాపాడుతున్నారు. విలువిద్యలో మహిళల విభాగంలో మన దేశానికి మొట్టమొదటి పతకాన్ని అందిచారు. ఈ విజయంలో మన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పాత్ర చాలా వుంది. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిపతం అందించింది. ఇదే విషయాన్ని ఆమె తండ్రి సరేంద్ర పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు.
17వ ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో భారతజట్టుకు కాంస్య పతకం వచ్చింది. జ్యోతి సురేఖతోపాటు త్రిషా దేవ్, పూర్వాషా సుధీర్ షిండే ఈ జట్టులో వున్నారు. మొదట్లో బాగానే రాణించి, సెమీ ఫైనల్ దాకా చేరుకున్న ఈ జట్టు.. చైనా చేతిలో ఓడిపోయింది. అయితే కాంస్య పతక పోరులో మాత్రం ముందంజ వేసింది. ఇరాన్ జట్టుతో తలపడిన భారత అమ్మాయిలు 224 పాయింట్లు స్కోర్ చేయగా.. ఇరాన్ జట్టు మాత్రం 217 పాయింట్లకే పరిమితం అయ్యింది. ఈ మొత్తం విభాగంలో దక్షిణ కొరియా స్వర్ణం, చైనా రజతం, ఇండియా కాంస్య పతకాలను సాధించుకున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. కాంపౌండ్ ఆర్చరీ అనే పోటీ తొలిసారిగా ఈ ఆసియా క్రీడల్లోనే మొదలైంది. అంటే.. మొదటిసారిగా జరిగిన పోటీల్లో మన భారత జట్టు మహిళలు కాంస్య పతకం గెలుచుకుని రావడం నిజంగా విశేషమే!
ఇలా ఈ విధంగా జూనియర్లు తమ ప్రతిభతో భారతగౌరవాన్ని కాపాడుతుంటే.. మరోవైపు సీనియర్లు మాత్రం ఆట మొదట్లోనే చతికిలపడిపోతున్నారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ లో కశ్యప్, శ్రీకాంత్ లాంటి గొప్ప ప్లేయర్లు ఓడిపోయి ఇంటిదారి పట్టగా.. సైనా నెహ్వాల్ కూడా క్వార్టర్ ఫైనల్ లోనే నిష్ర్కమించింది. దీంతో ఇంచియాన్ ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ఏ పతకం సాధించకుండానే ముగిసింది. 1982 ఆసియా క్రీడల తర్వాత ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకం నెగ్గలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సైనా 21-18, 9-21, 7-21తో రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ సైనా క్వార్టర్స్లోనే ఓడింది. ఇక పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కశ్యప్ 12-21, 11-21తో ప్రపంచ నంబర్వన్ లీ చోంగ్ వీ (వులేసియూ) చేతిలో; శ్రీకాంత్ 21-19, 11-21, 18-21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ వాన్ హో సన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more