దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈసారి అనుకోకుండా కొన్ని వివాదాలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే ఈ వివాదాలకు కారణమవుతున్నది మరెవ్వరో కాదు.. స్వయంగా ఆ ఆటలను నిర్వహిస్తున్న అధికారులేనని క్రీడాకారులు పేర్కొంటున్నారు. ఆటలు మొదలయ్యే ముందు ఒక విధంగానూ.. మొదలైన తర్వాత మరోవిధంగానూ అధికారులు వ్యవహరిస్తున్నారని క్రీడాకారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ క్రీడల్లో పాల్గొన్న ముస్లిం మహిళలు కూడా ఇటువంటి ఆరోపణలనే అధికారుల మీద గుప్పిస్తున్నారు. ఈ వివాదాల వల్ల ఒక బాస్కెట్ బాల్ మ్యాచే ఆగిపోయింది.
అసలు జరిగిన విషయం ఏమిటంటే... ఆసియా క్రీడలకు వచ్చేముందు అధికారులు బురఖా ధరించడానికి తమకు హామీ ఇచ్చారని కతార్ క్రీడాకారిణి అమల్ మహ్మద్ చెప్పింది. కానీ తీరా మ్యాచ్ ఆడే సందర్భంలో బురఖా ధరించడానికి అధికారులు నిరాకరించారు. దీంతో కతార్ మహిళల బాస్కెట్ బాల్ జట్టు ఆసియా క్రీడల్లో మంగోలియాతో మ్యాచ్ ఆడేందుకు తిరస్కరించారు. ‘‘బురఖా తొలగించడానికి మా ముస్లిం మతం అనుమతించదు. అందుకే మంగోలియాతో మ్యాచ్ ను వదిలేసుకున్నాం. అధికారులు తమ నిర్ణయం మార్చుకునేంతవరకు ఈ క్రీడల్లో మ్యాచ్ లు ఆడబోము’’ అని అమల్ తెలిపింది.
మరోవైపు.. ఆసియా క్రీడల ప్రతినిధులు ఈ విషయం వెనకడుగు వేస్తున్నట్లు కనిపించడం లేదు. మ్యాచ్ కు ముందు బురఖా తొలగించాలని క్రీడాకారులను కోరామని.. అయితే అందుకు వారు తిరస్కరించడారని ఒక ప్రతినిధి చెప్పాడు. ‘‘ఇది అంతర్జాతీయ బాస్కెట్ సమాఖ్యకు సంబంధించిన విషయం. ఆసియా క్రీడలతో బురఖాతో ఎటువంటి సంబంధం లేదు’’ అని వివరంగా చెప్పకుండా ముగించేశారు. మరి ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుందో..? అధికారులు బరఖా ధరించడానికి అనుమతి ఇస్తారా..? లేదా ముస్లిం మహిళలే బురఖాలు తొలగించి క్రీడల్లో పాల్గొంటారా..? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more