ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు మన భారత క్రీడాకారులు ఓ మోస్తరు వరకు తమ సత్తా చాటుకుంటూ ముందుకు వచ్చారు. ఒకవైపు చైనా 100కు పైగా స్వర్ణ పతకాలను సాధించి ముందుకు దూసుకుపోతుంటే.. ఇండియా మాత్రం ముక్కుతూ మూలుగుతూ ముందుకు సాగుతోంది. రజత, కాంస్య పతకాలను సాధించడంలో ఫర్వాలేదనిపించుకున్న భారత్.. స్వర్ణ పతకాలను సాధించడంలో చాలా వెనుకబడిపోయిందనే చెప్పుకోవాలి. ఇంతవరకు భారత్ కేవలం 4 స్వర్ణపతకాలను మాత్రమే గెలుచుకున్నప్పటికీ.. ఆ పతకాలను సాధించడంలో క్రీడాకారులు చరిత్రనే సృష్టించారని చెప్పుకోవాలి. మొదటి మూడు స్వర్ణపతకాల విషయం పక్కనపెడితే.. తాజాగా నాలుగో స్వర్ణాన్ని గెలుచుకోవడంలో రెజ్లింగ్ విభాగంలో యోగేశ్వర్ దత్ 28 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు.
1986 సియోల్ ఆసియా క్రీడల్లో కర్తార్ సింగ్ పసిడి గెలుచుకున్న తర్వాత భారత్ కు రెజ్లింగ్ లో స్వర్ణం రావడం ఇదే తొలిసారి. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ లో మొదటినుంచి బాగానే ప్రదర్శించిన యోగేశ్వర్.. సెమీఫైనల్లో కాస్త తడబడ్డాడు. ఒక దశలో 5-7తో ఓడిపోయే స్థితిలో వున్న దత్.. అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించాడు. ఇఖ ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించి 3-0తో జలీంఖాన్ (తజకిస్తాన్)ను చిత్తు చేశాడు. 2006 క్రీడల్లో కాంస్యం గెలిచిన దత్ కు ఇదే ఎంతో ఉత్తమమైన ప్రదర్శన. దీంతో ఇతను విజయం సాధించడంతో ఇండియా ఖాతాలోకి నాలుగవ స్వర్ణం చిక్కింది. అయితే రెజ్లింగ్ లో పురుషుల 97 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సత్యవర్త్కడియన్, మహిళల 55 కేజీల ఫ్రీస్టయిల్ లో బబితా కుమారిలు కాంస్య పతక మ్యాచుల్లో ఓడిపోయారు. ఇక జ్యోతి 75 కేజీల విభాగంలో క్వార్టర్స్ లోనే పరాజయం చవిచూసింది.
మిగతావారి విషయాలకొస్తే.. మహిళల 20 కి.మీ నడకలో కుశ్ బీర్ సంచలన విజయం సాధించింది. ఆసియా క్రీడల అథ్లెటిక్స్ లో 20 కి.మీ. విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సాధించింది. మరోవైపు పురుషుల 400 మీ. పరుగులో రాజీవ్ అరొకియా కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 400 మీ. పరుగులో పూవమ్మ కాంస్యం గెలిచింది. మహిళల హ్యామర్ త్రోలో మంజుబాలా కాంస్యం సాధించింది. ఇక హైదరాబాదీ సానియా మీర్జా కూడా తన సత్తా చాటుకుంది. మహిళల డబుల్స్ ప్రార్థనతో కలిసి కాంస్యం గెలిచిన సానియా.. తెలుగుతేజం సాకేత్ మైనేని తోడుగా మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ చేరి రజతం ఖాయం చేసుకుంది. ఇలా ఒక్కొక్కొరు తమతమ ప్రతిభతో కాంస్యం, రజత పతకాలను గెలుచుకోవడంలో తమ ప్రతిభను బాగానే ప్రదర్శిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more