కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది..? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది..? కేంద్రం అడుగులు ఏ విధంగా సాగుతున్నాయి.. ఎందుకని చెప్పిన మాటలను వెనక్కి తీసుకోనుందియి. పాత పరిస్థితినే ఎందుకు తీసుకురాదలిచింది.. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా ఎందుకు వ్యవహరించాలని భావిస్తుంది...? అసలేం జరుగుతుంది.. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం లక్ష్యాలను చేరిందా..? చేరితే మళ్లీ ఎందుకు అలాంటి నిర్ణయాలు..? నోట్ల రూపంలో రద్దు చేసిన డినామినేషన్ ను మళ్లీ నాణెం రూపంలో ఎందుకు తీసుకురావాలని భావిస్తున్నారు..? ఎందుకని డొంకతిరుగుడు విధానాన్ని అవలంభిస్తున్నారు.
ఇవన్నీ ప్రశ్నలు పెద్దల సభలోని పార్లమెంటు సభ్యలు సంధిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తనదైన మౌనముద్రను వహిస్తుంది..? గత ఏడాది నవంబర్ 8న పాత పెద్ద నోట్లు రద్దును చేసిన ప్రభుత్వం.. తాజాగా అదే తరహాలో కేవలం రెండు వేల నోటును రద్దు చేయనుందన్న వార్తలు రావడంతో రాజ్యసభలోని ఎంపీలు ఈ విషయమై ప్రభుత్వం నుంచి సమాధానం రావాలని కోరారు. అయినా అటు కేంద్రం నుంచి కానీ ఇటు అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి కానీ ఏ సమాధానం లేదు. దీంతో మళ్లీ ఏదో జరగబోతుందన్న సంకేతాలు మాత్రం దేశప్రజలకు అందుతున్నాయి.
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం చెప్పిన అవినీతి, నల్లధనం, నకలీ దనం లక్ష్యాలను అందుకుందా..? అంటే లేదన్న సమాధానమే వస్తుంది. ఇందుకు కోట్ల రూపాయలలో నల్లధనం, నకిలీ దనం అధికారుల తనీఖీలలో బయటపడుతూనే వుంది. ఈ నేపథ్యంలో ఈ అర్తిక సంవత్సరం నుంచి కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ.2000 గులాబీ నోట్లును కూడా తాము ముద్రించడం లేదని స్వయంగా అర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ విపక్షాలకు చెందిన ఎంపీలతో పాటు ఇటు దేశ ప్రజల్లోనూ నెలకొంది.
ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన మరో తాజావార్త దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. అదే వెయ్య రూపాయల నాణెం. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెప్పిన కేంద్రం.. మళ్లీ పాత విలువతో కూడిన నాణాన్ని చెలామనిలోకి తీసుకురానున్నట్లు వస్తున్న వార్తులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. నోటుకు బదులు నాణెలను తీసుకువస్తే.. అసులు నోట్లు రద్దు ఉద్దేశ్యం ఏమిటన్నది కనీసం ప్రభుత్వానికైనా స్పష్టత వుందా..? లేక ప్రజలు కష్టాలు పడితేనే తమను గుర్తుంచుకుంటారని కేంద్రం భావిస్తుందా..? అన్న ప్రశ్నలు విపక్షాల సభ్యుల నుంచి వినబడుతున్నాయి. మరీ ఈ విషయంలో ఇకనైనా కేంద్రం క్లారిటీ ఇస్తుందా..? లేక తన వ్యూహమేదో తానే కొనసాగిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more