రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ పోటీచేస్తారని తొలుత ప్రకటించినా.. తరువాత అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే జనసేన ఏపీకే పరిమితం అన్న సమయంలో ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఈక్వేషన్స్ ను పవన్ వ్యాఖ్యలు మార్చేస్తున్నాయి.
తెలంగాణలో ఇప్పటికే పక్కలో బళ్లెంలా మారిన బీజేపి పార్టీకి.. పవన్ కల్యాణ్ కూడా జత కలిస్తే ఆ ప్రభావం ప్రజల్లోకి ఎలా వెళ్తుందని అధికార టీఆర్ఎస్ పార్టీ సహా విపక్ష పార్టీలు బేరిజు వేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నిక్లలో తెలంగాణలోనూ జనసేన సత్తా చాటుదామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పవన్ వ్యాఖ్యలతో అప్పటికే ఈలలు, కేరింతలతో ఉత్సాహంగా వున్న కార్యకర్తలు, అభిమానలకు పవన్ కల్యాణ్ మాటలు.. జీవవాయువును అందించాయి. జనసేన అవిర్భావంలో ఎన్నికలకు దూరంగా నిలిచిన జనసేన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా నిలవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.
ఇక అప్పటి లోటును భర్తి చేసేలా ఇవాళ పవన్ చేసిన ప్రసంగం.. కార్యకర్తలు.. అభిమానులలో నూతనోత్తేజం కలిగించింది. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరిమిత సంఖ్యలో జనసేన పోటీ చేయబోతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లోనూ తాము గెలుపోటములను ప్రభావితం చేస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో తమకు ఓటు బ్యాంకు ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పిన పవన్.. ఓటమికి కుంగిపోను అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్రంలో జనసేన జెండా ఎగరాలని ఆకాంక్షించారు.
ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలు తమ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయని పరిశీలించే పనిలో పడ్డారు. తమ పార్టీతో ఇప్పటికే కొనసాగుతున్న మైత్రి.. తెలంగాణలోనూ వినియోగించుకునేలా బీజేపి ప్లాన్ చేసిందా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని.. అందుకు అన్ని ప్రత్యర్థి పార్టీలు కలసి కూటమిగా ఏర్పడాలని ఇప్పటికే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జనసేనాని.. అదే కూటమితో తెలంగాణలోనూ రాజకీయ తెరంగ్రేటం చేసి రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపుతారా.? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక అధికార టీఆర్ఎస్ లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కొత్త టెన్షన్ ను రాజేశాయి. ఓ వైపు సీఎం హస్తిన పర్యటనలో, కీలకమైన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండగా, రాష్ట్రానికి వచ్చిన పవన్ అగ్గిరాజేశారనే చెప్పాలి. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ బ్రాండ్ ఇమేజ్ అయిన ఆయన ఎర్రని కండువాను భుజాలపై వేసుకుని.. పవన్ అభిమానులను తమవైపు తిప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ.. రానున్న ఎన్నికలలో పవన్ కల్యాణ్ సహ జనసేన పార్టీని ఎలా ఎదర్కోవాలి అని ఆ పార్టీ నేతలు మేధోమధనంలో పడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన సభ విజయవంతమైన నేపథ్యంలో..దానిని ప్రజలు మర్చిపోయి.. తన పర్యటనను గుర్తుపెట్టుకుని మాట్లాడేలా తెరవెనుకనుంచి టీఆర్ఎసే ఇలా ప్లాన్ చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది నిజమో తెలియాలంటే.. ఎన్నికల సీజన్ వరకు వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
May 19 | సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more
May 18 | గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత... Read more
Mar 18 | కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ... Read more
Mar 18 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా... Read more
Mar 17 | రాష్ట్రంలో 2024లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలన్న యోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన 9వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ ఈ మేరకు సంకేతాలను... Read more