కాల్ మనీ కుంభకోణం సంభంధించిన అంశంలో ఇంటెలిజెన్స్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించరా లేదా..? అన్నది ఇప్పడు ..హాట్ టాపిక్ గా మరింది. విజయవాడకు మాత్రమే పరిమితం అనుకుంటే.. అక్కడి ఆరు సర్కిళ్ల వరకు విస్తరించిందని తెలుసుకుని విస్మయం చెందిన ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వేళ్లూనుకుందని తెలిసి.. ఆశ్చర్యానికి, ఆందోళనకు లోనవుతున్నారు. చాపకింద నీరులా కాల్ మనీ వ్యాపారం రాష్ట్రంలని 13 జిల్లాల్లో విస్తరించినా.. దీని గురించి ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియదా..? అయితే వారు ప్రభుత్వానికి సమాచారం అందించారా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
కాల్ మనీ వ్యవహారాన్ని చిన్న ఘటనగా కోట్టిపారేయలేం. బాధితులను ముఖ్యంగా మహిళలను వారు వేధించిన తీరును బాధితుల మాట్లలో వింటే.. కర్కష హృదయం కూడా కరుగుతుంది. మీకు మేము అండగా వుంటామని రంగంలోకి దిగి కాల్ యముళ తాట తీస్తుంది. ఒక పోలీసు అధికారిపై చర్యలు.. మరో ఆరుగురిపై కూడా బదిలీ వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్దమైందన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యవహరాంలో కాల్ మనీ బ్రోకర్లు జరిపిన దారుణాలు, ఘోరాలు.. చెప్పుడానికే అసహంగా వున్నాయి. ధన మదంతో.. కామవాంచతో.. బలంవంతంగా పరాయి మహిళలను వ్యభిచారిణులుగా మార్చి.. వారి బాడు (కష్టార్జితాన్ని) తినేందుకు కూడా సిద్దపడ్డ బ్రోకర్ల సమాచారం ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి చేరవేశారా..? లేదా..? అన్నదే చర్చనీయాంశంగా మారింది.
ప్రజలు, పార్టీలు, విపక్షాలు, ఇలా ఎవరేం అనుకుంటున్నారు..? ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయా..? లేక ప్రజలు ప్రభుత్వ పనితీరుకు దన్నుగా వున్నారా.. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా..? ప్రభుత్వంపై ప్రజలేమనుకుంటున్నారు.. ఇలా అన్ని కోణాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి.. ప్రభుత్వానికి తెలియజేసే విభాగమే ఇంటెలిజెన్స్.
మరోలా చెప్పాలంటే ప్రజల ప్రభుత్వానికి మధ్య ఇంటెలిజెన్స్ అదృశ్య అనుసంధాన కర్తలా వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి ఎవరైనా ఎదురుతిరుగుతున్నారన్న సమాచారం, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయన్న సమాచారం కూడా ముందస్తుగానే పసికడతాయి. అయితే కాల్ మనీ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ పనితీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తనదాక వస్తే ఒకలా.. ప్రజలకు కష్టం వస్తే మరోలా వ్యవహరించడంతో టీడీపీ ప్రభుత్వ వైఖరి.. వేర్వేరని కాల్ మనీ ఘటనతో అర్థవుతుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అదే చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముందస్తుగానే తమను అలెర్ట్ చేయలేదన్న కారణంగా ఇంటెలిజెన్స్ ఐజీ అనురాధను ఉన్నఫళంగా స్థాన చలనం చేయించి మరో ఐపీఎస్ అధికారి (ఏబీ వెంకటేశ్వర రావు)ని ఇంటెలిజెన్స్ డీజీగా ఆ స్థానంలో నియమించి.. తమకు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలను ముందస్తుగానే తెలియజేయాలని ప్రభుత్వం అదేశించింది.
అయితే కొత్తగా ఇంటెలిజెన్స్ బాద్యతలను అందుకున్న అధికారి ఏబీ వెంకటేశ్వర రావు రాష్ట్ర వ్యాప్తంగా వేళ్లూనుకున్న కాల్ మనీ పై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి ముందుగానే అందించారా లేదా..? ఒక వేళ సమాచారం అందించిన పక్షంలో ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వేళ ఇంటెలిజెన్స్ అధికారులు ఇందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి అందచని పక్షంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్న పక్షంలో పార్టీ అధినేత చంద్రబాబు సంబంధించిన అంశంలో అయితే ఒకలా, అదే ప్రజలకు ముఖ్యంగా తెలుగింటి ఆడపడచులకు సంబంధించిన విషయంలో అయితే మరోలా చర్యలు తీసకుంటారా అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. మరి కాల్ మనీ కేసును చంద్రబాబు సర్కార్ ఎలా పరిష్కరిస్తుంది..? కాలయముళ్ల చుట్టు ఉచ్చును ఎలా బిగిస్తుంది అన్నది వేచి చూడాల్సిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more