కాల్ మనీ.. రాష్ట్రంలో సంచలనానికి తెర తీసింది. ఓ వైపు డబ్బులు, డబ్బుల మాటలు ఆడవాళ్లతో తోలు వ్యాపారం చేయిస్తున్న కాలాంతకులకు శిక్ష పడుతుందా అన్న ప్రశ్నకు సమాధానం దొరికేటట్లు కనిపించడం లేదు. ఏపిలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆడవాళ్ల మానాలతో, వారి ఆస్తులతో ఆడుకున్న కాలాంతకులకు తగిన శిక్ష వేస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కాల్ మనీ కాలాంతకులను కాపాడేటట్లే కనిపిస్తున్నాయి.
విజయవాడ కేంద్రంగా, పలు మేజర్ నగరాల్లో చోటుచేసుకున్న కాల్ మనీ వ్యవహారం వికృత క్రీడ బయటకు వచ్చింది. కాల్ మనీ పేరుతో చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాల్ మనీ బాధితులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు, పోలీసుల ముందుకు వస్తున్నారు.అయితే కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండటంతో చివరకు చంద్రబాబు మెడకే ఉచ్చుబిగుస్తోంది. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులను కాపాడుకునే క్రమంలో చంద్రబాబు సర్కార్ కావాలనే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా విజయవాడ కమీషనర్, కాల్ మనీ కేసును వేగంగా విచారిస్తున్న గౌతమ్ సవాంగ్ ను సెలవుపై ఎందుకు పంపిస్తున్నారు అన్నది ప్రశ్న. ఎందుకంటే కాల్ మనీ కేసు కీలక దశలో ఇలా నిజాయితీగా పని చేస్తున్న పోలీస్ అధికారిని సెలవు మీద పంపించడం ఏంటని.. దాని మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే గౌతమ్ సవాంగ్ చాలా రోజుల క్రితమే సెలవు కొసం వినతి పెట్టుకున్నారని పోలీస్ వర్గాలు అంటున్నాయి. కానీ అంత అర్జంట్ గా కమీషనర్ ను ఎందుకు సెలవు మీద పంపుతున్నారని చంద్రబాబు నాయుడు మీద విమర్శలకు తావిస్తున్నారు. అయితే కాల్ మనీ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారని.. కేసు విచారణ నిఖచ్చిగా జరిగితే తమ పార్టీ నాయకుల బండారమే బయటపడుతుందని.. అది పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు అని చంద్రబాబు నాయుడు కావాలనే కేసును తొక్కిపెడుతున్నారని రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అది కూడా నిజమే అనిపిస్తోంది అందుకే కమీషనర్ ను ఆగమేఘాల మీద సెలవు మీద పంపించేస్తున్నారని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more