తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో పెకిళించాలన్న టీఆర్ఎస్ పార్టీ అభీష్టం.. కొద్దికొద్దిగా సంకల్పిస్తోంది. పార్టీని గడ్డ పరుస్థితి నుంచి మెరుగుపర్చేందుకు ఆ మధ్య యువ నాయకుడు.. నారా లోకేష్ బాబు చేసిన యత్నాలు ఫలించకపోగా.. అతను కేవలం ట్విట్టర్ ను అనుసంధానంగా చేసుకుని అధికార పార్టీపై విమర్శలు గుప్పించడంతో అతడిని ట్విట్టర్ పిట్టగా అభివర్ణించారే తప్ప పార్టీకి ఎనగూరిన లాభం ఏమాత్రం లేదని తెలుసుకున్న పార్టీ వర్గాలు అతడిని తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వలసగా తీసుకెళ్లాయి. ఇక ఈ సమయాన్ని అదునుగా చేసుకున్న తెలంగాణ అధికారిక పార్టీ తెలంగాణ టిడిపి నేతలకు గాలం వేస్తోంది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్శహించాలని అదేశించిన నేపథ్యంలో.. గ్రేటర్ లో బలంగా వున్న పచ్చ పార్టీని పక్కన బెట్టి అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలా అన్న తపన అధికార పార్టీలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
ఈ క్రమంలో గత కొంతకాలంగా పక్కనబెట్టిన అపరేషన్ ఆకర్ష్ ను మళ్లీ తెరమీదకు తీసుకోచ్చింది. ముందుగా మంచిరెడ్డిని పార్టీ వైపు ఆకర్షించింది. సరిగ్గా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించున్న క్రమంలో ఆయనకు షాక్ ఇచ్చారు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సైకిల్ దిగి కారెక్కేందుకు రెడీ అయ్యారు. టీడీపీ నేతల బుజ్జగింపు ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ ఉదయం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అయితే మంచి రెడ్డి కిషన్ రెడ్డి టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఈ నెల 24వ తేది టిఆర్ఎస్ కండువా కప్పుకుంటారని ఖరారరైంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఇవ్వాలని పార్టీ అంతర్గతంగా ఓ నిర్ణయానికి వచ్చింది.
అయితే గతంలో మంచిరెడ్డితో పాటు ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ లోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరి నిమిషంలో పార్టీ నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించడంతో కేవలం తీగల కృష్ణారెడ్డితో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే పార్టీలోకి వెళ్లారు. అయితే ఇప్పుడు తాజాగా జిల్లా అధ్యక్షుడిగా కోనసాగుతున్న మంచిరెడ్డి.. టీఆర్ఎస్ లో చేరుతున్న క్రమంలో.. ప్రకాష్ గౌడ్ కు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలను అప్పగిస్తే ఆయన కూడా టీఆర్ఎస్ తీర్థం తీసుకుంటారేమోనన్న అందోళన పార్టీ వర్గాల్లో నెలకోంది. ఇందుకు మంచిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా బలాన్నిస్తున్నాయి. నాది ఆరంభమే.. నా తరువాతే భవిష్యత్తులో ఎంత మంది టీఆర్ఎస్ లోకి వచ్చి చేరుతారో వేచి చూడండి అన్న ఆయన వ్యాఖ్యలు మరికోందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారన్న సంకేతాలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ ను కాదని జిల్లా పరిధిలోకి వచ్చే పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ అద్యక్ష పదవిని కట్టబెడితే.. తెలుగు దేశం ఆంద్రవాళ్ల పార్టీ అని.. అందుకే వారికే పార్టీ పగ్గాలను అప్పగించిందన్న ప్రచారం కూడా జోరుగా సాగి పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి వుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎటోచ్చినా.. ముందు నుయ్యి.. వెనక గోయ్యి అన్నట్టుగా మారింది తెలంగాణలో టీడీపీ పరిస్థితి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more