తెలుగు వారి రాజకీయ రణరంగంలో కొత్త ముద్రలు వేస్తున్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో టిడిపికి అవసరం వచ్చింది. తెలుగుదేశం పార్టీతో కలిసి, ఎన్డీయే కూటమి తరఫున గత ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ కు జనాలు బ్రహ్మరథం పట్టారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్, జనాల్లో అతనిపై అభిమానానికి విస్తుపోయారు. రాజకీయాల్లో ఎంతో చాణిక్యాన్ని కలిగిన నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సత్తా గురించి ముందే తెలుసుకొని, మోదీ ద్వారా తన పార్టీ తరఫున ప్రచారం చేయించుకున్నారు. అలా ఎన్నికల్లో పవన్ ప్రచారం బాగా కలిసి వచ్చింది. అయితే మరోసారి పవన్ కళ్యాన్ సెంటిమెంట్ ను ఫాలోఅవుతున్నారు చంద్రబాబు నాయుడు.
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు సినీ నటుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ హాజరు కావాలని తెలుగుదేశం పార్టీ కోరుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఆహ్వానం పంపినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీ మహానాడు వచ్చే నెల 27 నుంచి 29 వరకూ విజయవాడలో జరగనుంది.ఈ మూడు రోజుల మహానాడుకు హాజరైతే సంతోషమని, అలా వీలుకాని పక్షంలో ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న హాజరుకావాలని పవన్కు టీడీపీ అగ్ర నాయకత్వం కోరినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణంలో భూ సమీకరణ విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకించి ఉద్యమం చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఈ ఆహ్వానంపై ఇంకా తన అభిమతాన్ని తెలియజేయలేదు. అయితే గత ఎన్నికల్లో పవన్ ప్రచారంతో బాగా కలిసి వచ్చిందని అందుకే మరోసారి పవన్ కళ్యాణ్ ను మహానాడు సందర్భంగా పిలవాలని టిడిపి ఆలోచనగా తెలుస్తోంది. అయితే మహానాడుకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చరిష్మా సరిపోవడం లేదని అందుకే పవన్ కళ్యాన్ అయితే మహానాడు సక్సెస్ అవుతుందని టిడిపి నాయకులు చంద్రబాబు సలహా ఇచ్చారట. అందుకే పార్టీ తరఫున మహానాడుకు పిలుపు వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా టిడిపి పార్టీలో చంద్రబాబు తగ్గిందా లేదా పవన్ కళ్యాణ్ చరిష్మా అంతకంతకు పెరుగుతోందా అన్నవి ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more