ఆసియాకప్ టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో టోర్నీలో మూడు విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. భారత విజయంలో మిథాలీ రాజ్(23), హర్మన్ప్రీత్ కౌర్(24), వేదా కృష్ణమూర్తి(29 నాటౌట్), అనుజా పటేల్( 19 నాటౌట్)లు తలో చేయి వేశారు.
అంతకుముందు లంక మహిళలు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు టీమిండియా ఎదుట 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక జట్టులో యశోదా మెండిస్(27), హసిని పెరీరా(46 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేదు. ఏడుగురు క్రీడాకారిణులు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో శ్రీలంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించగా, గోస్వామి, అనుజా పటేల్, పూనమ్ యాదవ్లు తలో వికెట్ తీశారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హన్సిక(2) నాల్గో ఓవర్లోనే పెవిలియన్ చేరి నిరాశపరిచింది. ఆ తరుణంలో యశోదా మెండిస్- హసిని పెరీరా ద్వయం ఇన్నింగ్స్ను నడిపించింది. వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత యశోద పెవిలియన్ చేరింది. ఆపై స్వల్ప వ్యవధిలో శ్రీలంక వికెట్లు కోల్పోవడంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. దాంతో లంక మహిళలు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more