తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇక తాజాగా క్రీడారంగంలోనూ తెలుగు అమ్మాయి సత్తా చాటునుంది.అందులోనూ అభిమానులు అధికంగా ఉండే క్రికెట్ లో తన అద్భుత ప్రతిభతో రాణించి.. ఏకంగా జాతీయ జట్టులో స్థానం పోందింది. అమె మరెవరో కాదు సబ్బినేని మేఘన. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన మేఘన ఆసియా కప్ జట్టుకు భారత్ అడే జట్టు ప్రాపబుల్స్ లో స్థానం దక్కించుకుంది.
బంగ్లాదేశ్ లోని సైలెట్ వేదికగా అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును ఆలిండియా మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. ఇక ఆ జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ సబ్బినేని మేఘనకు చోటు దక్కింది. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, పాకిస్థాన్, ఆతిథ్య బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ, థాయ్లాండ్, మలేసియా బరిలో నిలిచాయి.
తాలిబన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ లో అమ్మాయిల ఆటపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆఫ్ఘన్ క్రికెట్ టీమ్ ఈ టోర్నీకి దూరంగా ఉంది. తొలి రోజు, అక్టోబర్1న భారత్–శ్రీలంక మధ్య మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 3, 4 వ తేదీల్లో భారత్.. వరుసగా మలేసియా, యూఏఈతో తలపడుతుంది. ఏడో తేదీన చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఢీకొట్టనుంది. 8న బంగ్లాతో, 10న థాయ్లాండ్తో పోటీ పడుతుంది. 11, 13వ తేదీల్లో సెమీఫైనల్స్, 15న ఫైనల్ షెడ్యూల్ చేశారు.
భారత జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోశ్(కీపర్), స్నేహ్ రాణా, దయలన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవ్గిరే.
స్టాండ్ బై ప్లేయర్లు: తానియా సప్నా భాటియా, సిమ్రన్ దిల్ బహదూర్.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more
Sep 17 | ఆటగాడిగా భారత్ కు ఎన్నో విజయాలను అందించిన రవిశాస్త్రి... హెడ్ కోచ్ గా కూడా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు విదేశాల్లో మన జట్టు చిరస్మరణీయమైన విజయాలను... Read more