టీమిండియా క్రికెట్ లో దిగ్గజ అటగాడు సచిన్ టెండుల్కర్ తరువాత అంతటి క్రేజ్ సంపాదించిన క్రికెటర్ విరాట్ కోహ్లి. తాను నమోదు చేస్తున్న సరికోత్త రికార్డులతో భారత క్రికెట్లో స్టార్ ఆటగాడిగా ఎదిగి.. ఇటు భారతీయ అభిమానులతో పాటు అటు యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల ప్రశంసలతో మునిగిపోయాడు. క్రికెట్ ప్రపంచంలోని దిగ్గజాలు కూడా కోహ్లీ ప్రతిభను, అటతీరును నిత్యం ప్రశంసిస్తూనే వుంటాయి. ప్రత్యేకంగా లక్ష్య ఛేదనలో కోహ్లి రికార్డు అమోఘమని శ్లాఘించారు కూడా.
ఈ క్రమంలోనే విరాట్ వన్డేల్లో తనకు బెస్టు ఇన్నింగ్స్ గా అనిపించింది మాత్రం హోబర్టు వన్డే మాత్రమేనని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. 2013లో ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో విరాట్ చేసిన 133 పరుగులే తాను చూసిన విరాట్ వన్డే ఇన్నింగ్స్లో అత్యుత్తమం అంటూ గంగూలీ పేర్కొన్నాడు. ఈ రోజుకి శ్రీలంకపై సాధించిన విరాట్ ఆ ఇన్నింగ్సే తనకు అత్యంత ఇష్టమని గంగూలీ పేర్కొన్నాడు. శ్రీలంక 321 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచినప్పుడు విరాట్ ఆడిన తీరు అమోఘమన్నాడు.
ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లి 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక ప్రధాన బౌలర్ మలింగా వేసిన ఒక ఓవర్ లో 24 పరుగులను విరాట్ పిండుకోవడంతో పాటు మలింగా సైన్యాన్ని ఊచకోత కోసిన తీరుకూడా తనకు నచ్చిందన్నాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన కోహ్లి.. ఆ తరువాత బంతికి సిక్స్ కొట్టాడు. ఆపై మిగతా నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలిచాడు. మలింగా వేసిన 15 బంతుల్ని ఎదుర్కొన్న కోహ్లి 44 పరుగులు చేసి తన అదిపత్యాన్ని ప్రదర్శించాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై నమోదు చేసిన 183 వ్యక్తిగత పరుగుల్ని కూడా గంగూలీ పక్కన పెట్టేశాడు. అంతలా ఈ మ్యాచ్ తనకు నచ్చిందన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more