బంగ్లాదేశ్.. ఒకనాటి ససికూన. . ప్రపంచ హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటైన టీమిండియాను మట్టికరింపించిన పులులు. అలా ఇలా కాదు.. మునుప్పెన్నడే లేని విధంగా భారత్ పై వన్డే సీరీస్ ను గెలిచిన పులులు. క్రికెట్ చరిత్రలో తమకంటూ లేని ఒక పేజీని తెరవడంతో పాటు సువర్ణ అధ్యాయనాన్ని లిఖించింది బంగ్లా జట్టు. భారత్ పై తొలి వన్డే సీరీస్ ను కైవసం చేసుకుని దిగ్గజ ధోని సేనను మట్టికరిపించిన దిగ్గజేత్తగా నిలిచింది బంగ్లాదేశ్. ధోని సారధ్య వైఫల్యమో.. లేక వరుణుడి అటంకమో తెలియదు కానీ బంగ్లా పర్యటనలో దోనిసేన ఏ కోశాన తమ ప్రతిభను కనబర్చలేకపోయింది.
మూడు వన్డే ల సీరీస్ లో భాగంగా రెండు వన్డే మ్యాచ్ లను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్.. ప్రపంచ క్రికెట్ లో ఇక తాము పసికూన కాదని, తమ సత్తాను టీమిండియాపై చాటింది. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ జట్టను ఓడించి సత్తాను చాటుకున్న బంగ్లా తో టూర్ లో టీమిండియా ఆటగాళ్లు.. బ్యాట్స్ మెన్ సహా బౌలర్లందరూ పూర్తిగా విఫలమయ్యారు. పరుగులు సాధించడంతో టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లున విఫలయం కాగా, అటు బంగ్లా ఆటగాళ్ల విక్కెట్లు తీయడంలోనూ భారత బౌలర్లు చమటోడ్చాల్సి వచ్చింది.
మిర్పూర్ లో జరుగిన రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకున్న టీమిండియా.. పరుగలు వేటలో తడబడుతోంది. గత వన్డే మ్యాచ్ మిగిల్చిన ఓటమి గాయం నుంచి కోలుకుని రాణిస్తారనుకున్న ధోని సేన.. పరుగుల కోసం అపసోపాలు పడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దోనిసేన.. నిర్ణీత 50 ఓవర్లలో ఇంకా ఐదు ఓవర్లు మిగిలే వున్నా.. అలౌట్ అయ్యింది. 45 ఓవర్లలో కేవలం 200 పరుగులు సాధించింది. దీంతో లక్ష్యచేధనలో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ డక్ వర్త్ లూయిస్ సద్దతిన 47 ఓవర్లలో 200 పరుగులు చేయాల్సి వుంది.
ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ మినహా.. అందరూ బంగ్లా బ్యాట్స్ మెన్లు బాగా రాణించారు. సౌమ్య సర్కార్ 34 పరుగులతో రాణించగా, లిట్టన్ దాస్ 36 పరుగులు ముషిఫికర్ రహీమ్ 31, షకీబ్ అల్ హసన్ 51, షబ్బీర్ రహమాన్ 22 పరుగులతో సునాయాసంగా ఇంకా తొమ్మిది ఓవర్లు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాట్స్ మెన్లలో.. శిఖర్ ధావన్, ధోని, సురేష్ రైనా మినహా ఎవరూ రాణించలేకపోయారు. సూపర్ ఫామ్ లో వున్న అజ్యింక రహానేను ఈ మ్యాచ్ ను తప్పించిన కెప్టెన్ ధోని ఆయన స్థానంలో అంబటి రాయుడికి స్థానం కల్పించారు. అయితే ధోని అంచనాలు తలకిందులై.. అంబటి రాయుడు పరుగులేమి సాధించకుండానే వెనుదిరిగాడు.
అటు బౌలింగ్ లోనూ ధోని పలు మార్పులు చేశాడు. ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మల స్థానంలో అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణిలకు జట్టులోకి తీసుకున్నారు. మూడు వన్డలే సీరిస్ లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో ఓడిన ధోనిసేన సీరిస్ బంగ్లాదేశ్ కు అప్పగించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మముస్తాఫిజుర్ రహమాన్ ఆరు విక్కెట్లను సాధించగా, నజీర్ హుస్సేన్, రుబెల్ హుస్సెన్ చెరో రెండు విక్కట్లను పడగోట్టారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more