ఒకనాటి పసికూనగా పిలవుబడిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.. మునుపెన్నుడూలేని విధంగా భారత్ పై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి ‘పులి’గా పిలువబడుతోంది. ప్రపంచ హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటైన టీమిండియాను మట్టికరింపించింది. క్రికెట్ చరిత్రలో తమకంటూలేని ఒక పేజీని తెరవడంతోపాటు సువర్ణ అధ్యాయనాన్ని లిఖించుకుంది ఈ జట్టు. ధోని సారధ్య వైఫల్యమో.. లేక వరుణుడి అటంకమో తెలియదుకానీ బంగ్లా పర్యటనలో దోనిసేన ఇంత ఘోరపరాజయం పాలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ జట్టుపై, ముఖ్యంగా ధోనీ కెప్టెన్సీ మీద మళ్లీ ఆరోపణలు వెల్లువెత్తడం మొదలయ్యాయి.
ప్రస్తుతం టీమిండియా జట్టు పరిస్థితి ఇంత కిందకు జారిపోవడానికి, జట్టులో అన్ని సమస్యలకు ధోనీయే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో భాగంగా భారత్ విఫలం అవ్వడంతో ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ వాదనలు వినిపించాయి. ఇప్పుడు బంగ్లా చేతిలో ఘోరంగా ఓటమి పాలవడంతో మళ్లీ ధోనీ కెప్టెన్సీపై కామెంట్లు వస్తున్నాయి. ఈ విధంగా తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ధోనీ తనదైన రీతిలో స్పందించాడు. ప్రస్తుత భారత క్రికెట్ లో అన్ని సమస్యలకు తనే కారణమైతే తాను కెప్టెన్సీ నుంచి సంతోషంగా తప్పుకోవడానికి సిద్ధంగా వున్నానని ధోనీ స్పష్టం చేశాడు.
ఈ క్రమంలోనే ధోనీ మాట్లాడుతూ.. ‘ఒకవేళ నన్ను తొలగించడం సమర్థనీయమైతే, టీమిండియా జట్టులో అన్ని సమస్యలకు నేనే కారణమైతే, నేను తప్పుకోవడానికి సిద్ధం’ అని పేర్కొన్నాడు. ఇక బంగ్లా చేతిలో ఓటమిపాలైన తీరును వెల్లడిస్తూ.. ‘రెండో వన్డే మ్యాచ్ లో మాకు మంచి ఆరంభం లభించలేదు. భాగస్వామ్యం నమోదు చేయాల్సిన సమయంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. 200 పరుగల లక్ష్యం ఏ జట్టుకైనా సులభమే కాబట్టి.. మా బౌలర్లను తప్పుపట్టను. ఇప్పుడు నేను ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు’ అని ధోనీ తెలిపాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more