ఐపీఎల్-8లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచులో హైదరా‘బాడుడి’ ముందు పంజాబ్ ఓటమిని చవిచూడక తప్పలేదు. ఈ రెండుజట్లతో పోల్చుకుంటే పంజాబ్ లోనే ధీటైన ఆటగాళ్లు వున్నప్పటికీ.. సన్ ‘రైజ’ర్స్ ముందు నిలబడలేకపోయారు. పైగా.. లక్ష్యం కూడా అతి తక్కువే వున్నప్పటికీ.. పంజాబ్ దానిని ఛేదించడంలో ఎన్నో అవస్థలు పడింది కానీ ఫలితం దక్కలేదు. దీంతో హైదరబాద్ జట్టు 20 పరుగుల తేడాతో అద్భత విజయాన్ని కైవలం చేసుకుంది. మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు.. ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. దీంతో ఈ జట్టు పని ఇంతటితోనే ముగిసిందని భావించారు. అయితే.. కెప్టెన్ వార్నర్ 42 బంతుల్లో 58 పరుగులతో తన బ్యాటు ఝుళిపించి పరుగుల వర్షాన్ని కురిపించాడు. అలాగే హెన్రిక్స్, ఓజా, ఆశీష్ రెడ్డి తదితర బ్యాట్స్ మెన్లు తన ప్రతిభమేర స్కోరును జోడిస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లారు. దీంతో హైదరబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది.
ఇక 151 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు కూడా ఆదినుంచే పేలవ పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించింది. ఈ జట్టులో ధీటైనా ఆటగాళ్లు సైతం వెనువెంటనే పవెలియన్ చేరారు. ఆటగాళ్లందరూ భారీ షాట్లకు పోయి బోర్లపడిపోయారు. దీంతో జట్టు ఒక్కసారిగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో సాహా తన బ్యాటింగ్ తో జట్టును గెలుపు అంచులదాకా తీసుకెళ్లాడు కానీ.. ఫలితం లేకపోయింది. చివరికీ పంజాబ్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more