‘అనుకున్నదొకటి.. అయినదొకటి..’ అన్న వాస్తవం ఐపీఎల్ సందర్భంగా ఇప్పటికే ఎన్నోసార్లు చోటు చేసుకుంది. ఇటువంటి చమత్కారమే మరోసారి ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఎవరూ ఊహించని విధంగా జరిగింది. ఐపీఎల్-8లో భాగంగా నిన్న(మంగళవారం) రాత్రి చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న చెన్నై జట్టు అతి తక్కువ స్కోరుకే కుప్పకూలిపోవడంతో ఈ మ్యాచ్ ని కోల్ కతా అతి సునాయాసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. చివరికీ రిజల్ట్ అందరినీ షాక్ కి గురిచేసేలా చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ ధోనీ మంత్రం మరోసారి ఫలించడంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. టాస్ గెలిచిన కోల్ కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన చెన్నై ఆటగాళ్లు.. మొదటి నుంచే బోల్తాపడ్డారు. ధీటైన ఆటగాళ్లు సైతం కోల్ కతా బౌలర్ల ముందు తమ ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోయారు. దీంతో ధోనీ సేన నిర్ణీత ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే సాధించింది. ఇక 135 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆటగాళ్లు.. కెప్టెన్ గౌతమ్ గంభీర్ డకౌట్ కాగా మిగతా ఆటగాళ్లు మొదట బ్యాటింగ్ పవర్ ప్లేలో విజృంభించారు. జట్టు 6 ఓవర్లలోనే 2 వికెట్ల కోల్పోయి 52 పరుగులు చేశారు. రాబిన్ ఉతప్ప (39) శుభారంభాన్ని ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్ కోల్ కతాకే కైవసమని అంతా అనుకున్నారు. అయితే.. అప్పుడే చెన్నై కెప్టెన్ ధోనీ.. తరుచూ బౌలర్లను మారుస్తూ బ్యాట్స్ మెన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
అప్పటికీ బ్యాట్స్ మెన్లు కుదురుగా ఆడేందుకు ప్రయత్నించారు కానీ.. సాధ్యపడలేదు. ఇక విధ్వంసక ఆటగాడు యూసుఫ్ పఠాన్ రనౌట్ అవడంతో జట్టు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే 16వ ఓవర్ తర్వాత వరుసగా మూడు డకౌట్లు కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక చివరి ఆటగాళ్లు తమ శక్తిమేర జట్టును గెలిపించేందుకు ప్రయత్నించారు కానీ.. ఫలితం లేకపోయింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ సేన రెండు పరుగుల తేడాతోనే విజయం సాధించింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more