వరల్డ్ కప్ సమరం దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులతోపాటు ప్రముఖ క్రీడాకారుల్లో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఈ కప్’ను గెలుస్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ప్రముఖులు తమతమ జట్ల తరఫున ప్రచారాలు జరుపుకుంటున్నారు. తమ జట్టే గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అందరికంటే సచిన్ వ్యాఖ్యానించిన తరహా మరోలా వుంది. అందరూ వాయిస్తున్న డప్పు సౌండ్ ఒకే విధంగా వుంటే.. సచిన్’ది మాత్రం ఉత్సాహభరితంగా వుంది.
గతకొన్నాళ్ల నుంచి టీమిండియా ప్రదర్శించిన పేలవ పెర్ఫార్మెన్స్’పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే! అంతేకాదు.. ప్రపంచకప్ మొదటిరౌండ్’లోనే ఇండియా వెనక్కు తిరిగి వచ్చేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక భారతీయ అభిమానులైతే ఇండియా ఆటగాళ్లను లెక్కపెట్టి మరీ తిట్లపురాణాన్ని సంధిస్తున్నారు. కప్ గెలుస్తుందన్న ఆశాభావాన్ని ఎవరూ వ్యక్తం చేయడం లేదు. అయితే.. ప్రముఖులు మాత్రం ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని జపం చేస్తున్నారు. అయితే.. సచిన్ పేర్కొంటున్న తీరు చూస్తుంటే అభిమానుల్లో ఆశలు రేకెత్తించేలా వున్నాయి.
వరల్డ్ కప్’లో టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన సచిన్.. తనదైన రీతిలో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. టోర్నీలో ధోనీ సేన అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తుందని, దేశ ప్రలజ ముఖాలపై చిరునవ్వులు పూయించేందుకు ఇండియాజట్టు ‘సమ్ థింగ్ స్పెషల్’ రీతిలో రాణిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత జట్టుపై పూర్తి నమ్మకం వుందన్న సచిన్.. అభిమానుల మద్దతు, ప్రార్థనలతోనే టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనను కనబరుస్తారని అన్నాడు. చెన్నైలోని తాంబరం వద్ద సాయిరాం ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన సందర్భంగా సచిన్ ఇలా పేర్కొన్నాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more