వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 153 పరుగులతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ 150 పరుగులకు తోడు రహానే 88 పరుగులు జట్టుకు అసీస్ గడ్డపై తొలి విజయాన్ని సాధించి పెట్టాయి. అదే సమయంలో ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తున్న సురేష్ రైనా బ్యాట్ ను ఝుళిపించడంతో.. పామ్ లోకి వచ్చాడు. గత వార్మప్ మ్యాచ్ లో ఆసీస్పై చావుదెబ్బ తిన్న టీమిండియా ఈ మ్యాచ్ లో మాత్రం అన్ని విభాగాల్లో రాణించింది. పెద్ద జట్లపై చెత్తప్రదర్శనతో విమర్శలపాలైన ధోనీసేనకు పసికూనలపై ఫుల్ ప్రాక్టీస్ లభించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 364 భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ రోహిత్ శర్మ (122 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 150) సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు సురేశ్ రైనా 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75, అజింక్య రహానె 61 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 88 నాటౌట్గా నిలిచి ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో హమిద్ హసన్, మహ్మద్ నబి. దవ్లాత్ జద్రన్, షాపూర్ జద్రన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులే చేసింది. మంగల్ (60) అర్ధ శతకంతో పాటు ఘని (44) రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు. భారత బౌలర్లలో మోహిత్ శర్మ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, సురేశ్ రైనా ఒక్కో వికెట్ తీశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more