యాషెష్ సిరీస్... ఆరెండు దేశాలకు ఎంతో ప్రతిష్టాత్మకం. ప్రపంచకప్ కంటే ఎక్కువగా ఫీలవుతారు. ఎంతో కసితో ఆడుతారు. అలాంటి ఈ బూడిద టెస్టులో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియా పై అన్ని విధాల పై చేయిగా ఉంది. రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 100.1 ఓవర్లలో 361 పరుగులకు ఆలౌటయింది. 289/7 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు... ఆరంభంలోనే బ్రెస్నన్ (7), అండర్సన్ (12) వికెట్లను కోల్పోయింది. అయితే బ్రాడ్ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్సర్), స్వాన్ (26 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు) నిలకడగా ఆడారు. వీరిద్దరు ఆఖరి వికెట్కు 48 పరుగులు జోడించి ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. చివరకు ప్యాటిన్సన్ బౌలింగ్లో బ్రాడ్ అవుట్ కావడంతో లంచ్ విరామానికి కొద్ది ముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఘోర వైఫల్యంతో కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 233 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. మొదటి టెస్టులానే రెండో టెస్టులో కూడా బ్యాటింగ్ లో తడబడుతున్న ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడే అవకాశం ఉన్నా కానీ ఇంగ్లాండే బ్యాటింగుకు దిగి మొదటి మూడు వికెట్లను చేర్చారుకుంది. దీంతో ఒకే రోజు 16 వికెట్లు పడటంతో రెండో రోజు బౌలర్ల హవా కొనసాగింది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఓవరాల్గా 264 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో ఏడు వికెట్లు ఉన్నాయి. మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఆస్ట్రేలియా బాగా కష్టపడి ఈ మ్యాచ్ ని డ్రా చేసుకుంటే తప్ప సిరీస్ పై ఆశలు ఉండవు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more