మన భారత దేశంలో ఎంతో మంది ఆదరిస్తున్న క్రికెట్ ఆటకు రోజుకో మచ్చ వచ్చి పడుతుంది. మొన్నటికి మొన్న ఐపీఎల్ లో జరిగిన ఫిక్సింగ్ ఉదంతం మరచిపోక ముందే మరో మరక పడింది. మన ఇండియా క్రికెట్ చరిత్రలో తొలిసారి డోపింగ్ టెస్టులో ఓ క్రికెటర్ పట్టుబడ్డాడు. క్రీడా రంగంలో డోపింగ్ లు సర్వసాధారణమే అయినా, క్రికెట్ లో ఇలాంటి ఉదంతం జరగడం తొలిసారి. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు అయిన సాంగ్వాన్ డోపింగ్ చేసి దొరికిపోయాడు. గత రెండు సీజన్ల నుండి కోల్ కత్తాకు ఆడుతున్న సాంగ్వాన్ ఢిల్లీ రంజీ బౌలర్ ప్రదీప్ సాంగ్వాన్ రాండమ్ డోపింగ్ టెస్టులో శాంపిల్ పాజిటివ్గా తేలిందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్ లే ఆడిన సాంగ్వాన్ భుజం కారణంగా మిగతా మ్యాచ్ లు ఆడలేదు. లీగ్ సందర్భంగా ప్రదీప్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో ఈ విషయంపై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు బీసీసీఐ లేఖ రాసింది. లెఫ్టార్మ్ మీడియం బౌలింగ్ చేసే ఇతను 2007లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2008లో మలేసియాలో జరిగిన అండర్-19 వరల్డ్కప్లో విశేషంగా రాణించి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాపై 44 పరుగులకే 5 వికెట్లు తీసి భారత్కు చక్కని విజయాన్ని అందించాడు. అయితే సాంగ్వాన్ కావాలని ఉత్పేరకాలు వాడలేదని అతని సన్నిహితులు చెబుతున్నారు. తను బాగా లావవుతున్నందున జిమ్ కోచ్ చెప్పింన మాత్రలు వేసుకున్నాడు తప్పితే ఎటువంటి నిషేదిత ఉత్పేరకాలు వాడలేదని అంటున్నారు. ఒకవేళ దోషిగా తేలితే అతని కెరియర్ ముగిసినట్లేనని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more