క్రికెట్ లో కొన్ని ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ లు ఉంటాయి. ఆ మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి మ్యాచ్ లు వన్ సైడ్ వార్ ల నడిస్తే మజా ఏ ముంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇంగ్లాండ్ లో జరుగుతున్న ‘యాషెష్ ’ సిరీస్ అంతా ఏకపక్షంగా జరుగుతుంది. అతిథ్య జట్టు ధాటికి ఆసీస్ నిలవలేక పోతుంది. లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేసి ఆసీస్ 347 పరుగుల భారీ తేడాతో ఓటమిని కూడ మూట గట్టుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రెండు ఇన్నింగ్స్ ల్లో మంచి స్కోరు సాధించిన ఇంగ్లాండ్ ఆసీస్ కి 583 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 90.3 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాజా (133 బంతుల్లో 54; 7 ఫోర్లు) క్లార్క్ (85 బంతుల్లో 51; 7 ఫోర్లు) తప్ప మిగతా వారు పెవీలియన్ కి క్యూ కట్టే సరికి ఆస్ట్రేలియా భారీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఓ దశలో ఆసీస్ 192 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. కానీ చివర్లో ఆసీస్ ఆటగాళ్ళు కాసేపు విసిగించడంతో ఇంగ్లండ్ బౌలర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఓవర్ల కోటా పూర్తి కావడంతో అదనంగా మరో 8 ఓవర్ల పాటు మ్యాచ్ను కొనసాగించారు. ఎట్టకేలకు చివరి ఓవర్లో మూడో బంతికి స్వాన్ ప్యాటిన్సన్ ను అవుట్ చేయడంతో కుక్సేన సంబరాల్లో మునిగిపోయింది. రూట్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు లభించింది. మూడో టెస్టు ఆగస్టు 1 నుంచి 5 వరకు మాంచెస్టర్లో జరుగుతుంది. 1978-79 లో తరువాత ఇంగ్లాండ్ యాషెస్ లో వరుసగా రెండు టెస్టులు గెలిచింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more