భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ అయిన అజహారుద్దీన్ త్వరలో బాలీవుడ్ తెర పై కనిపించబోతున్నాడు. అంటే నటించేస్తున్నాడా అని ఆశ్చర్యపోకండి. ఆయన జీతంలో జరిగిన ఎన్నో సంఘటనలు, మలుపు, విషాదాలు, సంతోషాల ఆధారంగా ఓ సినిమా రూపొందబోతుంది. మణికట్టు మాయాజాలంతో బంతిని బౌంబరీకి పంపే స్పెషల్ బ్యాట్స్ మెన్ గా పేరుతెచ్చుకున్న ఈయన ఆట ఎందరో ఆటగాళ్లకు స్పూర్తి. అలాంటి అజహర్ జీవితంలో సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. ఇదే క్యాచ్ చేసి, క్యాష్ చేసుకోవాలనుకుంటుంది ప్రముఖ నిర్మాత, దర్శకురాలు అయిన ఏక్తా కపూర్. హైదరాబాదీ బ్యాట్స్మెన్, క్రికెటర్, ఎంపీ అజారుద్దీన్ కథను చిత్రంగా తీయడానికి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ సన్నాహాలు చేస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించకపోవడంతో మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పటికే మిల్కాసింగ్ జీవిత కథతో తెరకెక్కిన భాగ్ మిల్కా భాగ్ చిత్రం ప్రపంచమంతటా కలెక్షన్లతో అదరగొట్టేస్తుంది. బాక్సర్ మేరికామ్ బయోగ్రఫీ ఆధారంగా కూడా ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందుతుంది.
కమర్షియల్ పాయింట్లను క్యాష్ చేసుకోవాలనే బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు క్రీడాకారుల జీవితాలను తిరగేసే పనిలో పడ్డారని తెలుస్తుంది. అజహర్ బయోగ్రఫీ ఆధారంగా నిర్మించబోయే చిత్రానికి హక్కులను ఇప్పటికే సొంతం చేసుకోవడం కూడా జరిగినట్టు తెలుస్తోంది.. ఉత్తర ప్రదేశ్ నుంచి మొరాదాబాద్ ఎంపీగా కొనసాగుతున్న అజారుద్దీన్తో నిర్మాత ఇటీవల అగ్రిమెంట్ కూడా జరిగినట్టు తెలిసింది. ఇందులో అజహార్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరోలలో ఎవరో ఒకరు నటిస్తారని సమాచారం. ఏక్తా అజహార్ జీవితాన్ని ఎలా చూపించబోతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more