ఈ సీజన్ లో ఇంత వరకు ఖాతా తెరవకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండటమే కాకుండా తన సొంత మైదానంలో కూడా వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకొన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిన్న ముంబయితో జరిగిన మ్యాచ్ లో సొంత మైదానంలో తన పవర్ ఏంటో చూపించి ఆరు మ్యాచ్ ల ఓటమిని మరచిపోయేలా చేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పటికి నేను నేనే అంటూ, తన విశ్వరూపాన్ని చూపిస్తూ తన సహజమైన శైలితో ఆటను రక్తికట్టించి ప్రేక్షకులను వినోదాన్ని పంచాడు. ముందుగా బ్యాటిగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 161 పరుగులు సాధించింది. సచిన్ టెండూల్కర్ (47 బంతుల్లో 54; 3 ఫోర్లు; 2 సిక్స్), రోహిత్ శర్మ (43 బంతుల్లో 73; 5 ఫోర్లు; 5 సిక్స్) రాణించడంతో ముంబయి భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమే అనుకున్నారు ఢిల్లీ ఫాంని చూసి. కానీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 57 బంతుల్లో 95 నాటౌట్; 13 ఫోర్లు; 2 సిక్స్) విజృంభణతో పాటు కెప్టెన్ జయవర్ధనే (43 బంతుల్లో 59; 8 ఫోర్లు; 1 సిక్స్) కూడా రెచ్చిపోవడంతో 162 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు ఉండగానే ఛేధించింది. తొలి వికెట్కు వీరూ, జయవర్థనే 151 పరుగులు జోడించారు. విజయానికి మరో 11 పరుగుల దూరంలో మలింగా బౌలింగ్లో జయవర్ధనే ఎల్బీడబ్ల్యుగా వెనుదిరుగగా.. వార్నర్ (7)తో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించిన సెహ్వాగ్ ఆఖరు వరకు అజేయంగా నిలిచి మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. సెహ్వాగ్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more