ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభంలో మ్యాచ్ లు కాస్తంత చప్పగా సాగినా మొన్నటి నుండి ఐపీఎల్ లో ఎవరూ ఊహించని అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. ఫోర్లు, సిక్సర్ల మోతతో మైదానాలు హోరెత్తుతున్నాయి. నిన్న రాత్రి చెన్నైలో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులను వినోదాన్ని పంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ 61 బంతుల్లో 101; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. రహానే (15 బంతుల్లో 16; 1 ఫోర్) వాట్సన్ తొలి వికెట్కు 71 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్నిచ్చారు. స్టువర్ట్ బిన్నీ (22 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) వాట్సన్కు అండగా నిలవడంతో రాజస్థాన్ భారీ స్కోరును సాధించగలిగింది. దీంతో చెన్నైకి గెలుపు కష్టమే అనుకున్నారు అంతా.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై ఆది నుండే దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించి అద్భుతమైన విజయం సాధించింది. ఓపెనర్ మైక్ హస్సీ (51 బంతుల్లో 88; 13 ఫోర్లు, 1 సిక్సర్) సంచలన ఇన్నింగ్స్కు సురేశ్ రైనా (35 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీ తోడవడంతో చెన్నై గెలుపు సులభం అయింది. ఐపీఎల్ ఆరో సీజన్లో తొలి శతకం షేన్ వాట్సన్ చేశాడు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ప్రత్యర్థి జట్టులో మరో ఆసీస్ ఆటగాడు హస్సీ బ్యాటింగ్ ముందు వాట్సన్ శతకోత్సాహం మ్యాచ్ ముగిసేలోపే కనుమరుగైపోయింది. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more