దేశంలో నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడాల్లో కుంభాల్ ఘర్ కోట ఎంతో విశిష్టమైనది. రాజస్థాన్ రాష్ట్రం, రాజసమండ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన కుంభాల్ ఘర్ లో ఈ కోట వుంది. ఆరావళి ప్రాంతంలో 36 కిలోమీటర్ల వరకు విస్తరించి వున్న ఈ కోటను 15 శతాబ్దంలో రాణా కుంభా మహారాజు నిర్మించారు. ఈ కోటలో ఏకంగా 360 ఆలయాలు, 252 భవంతులతోపాటు వీటికి రక్షణగా ‘చైనా గోడ’లాగే ఇండియన్ వాల్ వుంది. మేవార్ నది ఒడ్డున వున్న ఈ భారీ కోట.. 13 శిఖరాలను, వాచ్ టవర్లను, బురుజులను కలిగి ఉంది. దీనిలోనే మహారాణా ఫతేసింగ్ నిర్మించిన గోపుర ప్యాలెస్ ఉంది. అత్యంత పొడవుగా ఉండే కుంభాల్ ఘర్ కోట గోడను శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం నిర్మించారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండో పొడవైన గోడగా ఇది ప్రసిద్ధి పొందింది. ఎంతో అద్భుతంగా కనువిందు చేసే ఈ కోటలో ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో విశిష్టతలు దాగి వున్నాయి.
* ఈ కోట ప్రాంగణంలో 360 హిందూ, జైన ఆలయాలు ఉన్నాయి. వీటిలో నీలకంఠ మహాదేవుని ఆలయం ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉంటాడు. ఇక్కడ ఉన్న ఆరు అడుగుల ఎత్తులోని శివలింగం దేశంలో ఉన్న అతి పెద్ద శివలింగాలలో ఒకటిది.
* కుంభాల్ ఘర్ కోటలోని హనుమాన్ పోల్ కు సమీపంలో వేది దేవాలయం కలదు. ఈ జైన దేవాలయాన్ని రాణా కుంభ నిర్మించాడు. ఈ ఆలయంలో జైనుల జీవన చిత్రాలను ప్రతిబింభించే విధంగా కలాకృతులు చెక్కించబడ్డాయి.
* కోటలోని పురాతన గుహలో పరశురాం దేవాలయం వుంది. ఈ ఆలయంలో పరశురామ రుషి విగ్రహం ఉంటుంది. పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని, పిమ్మట శ్రీరాముడి ఆశీర్వాదం పొందాడని చెపుతారు.
* కుంభాల్ ఘర్ లో ఉన్న అందమైన ప్యాలెస్ లలో ప్యాలెస్ ఒకటి. దీనినే మేఘాల ప్యాలెస్ అంటారు. ఈ ప్యాలెస్ లో రెండు అందమైన మహల్ లు ఉన్నాయి. చల్లటి గాలి లోనికి రావడం, వేడి గాలి బయటికి పోవడం వంటి విధానాలు ఇక్కడ గమనించవచ్చు.
కేవలం ఇవి మాత్రమే కాదు.. ఈ కోటలో చూపరులను కట్టిపడేసే మరెన్నో అద్భుతాలు దాగి వున్నాయి. ఈ కోటను సందర్శించాలంటే కేవలం ఒకరోజు సరిపోదు. 3500 అడుగుల ఎత్తులో వున్న ఈ కోట 36 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వుండటంతో.. దీనిని చూసేందుకు చాలా సమయం పడుతుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more