దేశంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ‘హొగెనక్కల్ జలపాతం’ ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో ఉన్నది. ఈ జలపాతం కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఆకాశం నుంచి దూకుతున్నట్లుగా కనిపించే ఈ జలపాతాన్ని ‘భారతీయ నయాగరా జలపాతం’ అని పిలుస్తారు. ఇక్కడున్న కార్బొనటైట్ రాళ్ళు దక్షిణాసియాలోనూ, ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు. చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించే ఈ జలపాతం ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే హోగెనక్కల్ సహజత్వానికి చేరువగా ఉంటుంది.
ఈ వాటర్ ఫాల్స్ లో లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతుంటాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్ధం అని. ఈ హోగేనక్కల్ జలపాతం కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అదెలా అంటే.. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ జలపాతం నీరు చూడటానికి వెరైటీగా వున్నప్పటికీ.. ఆరోగ్యపరంగా మేలు చేస్తాయట.
ఈ జలపాతంలో తెప్ప విహారం ఎంతో పేరుగాంచింది. తెప్ప అంటే, వెదురు బద్దలతో తయారు చేయబడిన ఒక చిన్న బోటుగా అంచులు కొంత వరకు మూయబడి వుంటుంది. నీరు లోనికి రాకుండా, జంతువుల చర్మం లేదా ప్లాస్టిక్ షీట్ వంటివి కింద వేస్తారు. తెప్పను నదులలో చేపలు పట్టేందుకు కూడా వాడతారు. ఎంతో ఆనందకరమైన ఈ తెప్ప విహారం తమిళనాడులోని హోగెనక్కల్ లో బాగా కనపడుతుంది. పురాతనమైన ఈ బోట్లు జలపాతాల నీటిలో వేగంగా ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణం కొద్దిపాటి భయం కలిగించి నప్పటికీ, సాహస వంతులకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ విహారం ప్రతిఒక్కరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఆనందకరమైన ఈ తెప్ప సాహస క్రీడ వర్షాకాలంలో మరింత ఆనందాన్ని ఇస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more