మానవ నిర్మితమైన అద్భుతమైన కళాఖండాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సృష్టించబడ్డాయి. ప్రస్తుతమన్నీ చాలావరకు సాంకేతిక పరికరాల ద్వారా రూపుదిద్దుకుంటున్నాయి కానీ.. దశాబ్దాలకాలాల క్రితం కొంతమంది కళాకారులు తమ చేతులద్వారా ఎన్నో అద్భుతనిర్మాణాలను సృష్టించారు. అటువంటివాటిల్లో ఈ ‘‘ఏనుగుదంతం’’ కూడా ఒకటి! ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శించబడుతున్న దీని పేరు ‘‘బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి’’!
ఏనుగుదంతపు విశేషాలు :
20వ శతాబ్ది తొలినాళ్లలో ఈ ఏనుగుదంతాన్ని ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఓ కళాకారుడు తయారుచేసినట్లు చారిత్రకారులు భావిస్తున్నారు. బుద్ధుని జీవిత గాథలను ఒకే ఏనుగుదంతంపై అంతర్భాగాలతో చెక్కిన అద్వితీయమైన కళాఖండమిది. ఈ ఏనుగుదంతంపై బుద్ధుని జీవితానికి సంబంధించిన 43 ఘట్టాలను చెక్కారు. వాటిలో మొదటి 25 బుద్ధుని జీవితంలో జననం నుంచి జ్ఞానోదయం వరకూ జరిగిన ఘట్టాలు కాగా... మిగిలిన 18 జ్ఞానోదయం నుంచి మహాపరినిర్వాణం వరకూ కలిగినవి.
ఈ దంతపు కళాకృతిలో మరికొన్ని కొత్త ఘట్టాలను కూడా చెక్కబడి వున్నాయి. అందులో భాగంగా.. సిద్ధార్థుడు పక్షి కోసం పోరాడడం, జంతుజాలాన్ని చంపడంపై అతని వ్యతిరేకత, మరణాన్ని గురించి గుర్తించడం వంటివి వాటిలో కొన్ని. అలాగే ఆ దంతంపైకి వెళ్ళేకొద్దీ దాని మందం తగ్గిపోతుంటుంది కాబట్టి.. పైన ఉన్న అరల చుట్టుకొలత తగ్గించి, వృత్తం నుంచి అరలను వేరే ఆకారానికి మార్చి వాటిలో భూమిస్పర్శ ముద్ర, అభయముద్ర, ధర్మచక్రప్రవతన ముద్ర వంటి సుప్రసిద్ధమైన ముద్రలతో ఉన్న బుద్ధుణ్ణి చెక్కారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more