పవర్ ఉండాలే కానీ ఏ పనైనా చకచకాల జరిగిపోతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. మన ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు ఇంకా బాగా తెలిసిన సిద్దాంతం. మంత్రిగారి కొడుకు రావెల్ సుశీల్. అంతకుముందు ఈయన గురించి ఎవ్వరికీ తెలియదు. కానీ బంజారాహిల్స్లో ఓ మహిళను ఈవ్ టీజ్ చేసి, ఆ తర్వాత అదే మహిళను లాగి తన కారులో ఎక్కించుకోవాలని ట్రై చేసిన ఇష్యూలో తెలుగు వాళ్ళందరికీ తెలిశాడు. కట్ చేస్తే హైకోర్ట్లో దిమ్మతిరిగే జడ్జ్మెంట్ వచ్చింది. సాక్ష్యాలు సరిగా లేనందున సుశీల్ ని నిర్ధోషిగా విడుదల చేస్తున్నామని హైకోర్ట్ స్పష్టం చేసింది. గమనించాల్సిన విషయం ఏంటంటే సుశీల్ తప్పు చేయలేదు అని కోర్ట్ చెప్పలేదు. సాక్ష్యాలు లేనందున విడుదల చేస్తున్నాం అని చెప్పింది. ఇక్కడే మంత్రిగారు తన బలం, బలగాన్ని ఎలా వాడారో తెలియచెప్పే విషయాలు కనిపిస్తున్నాయి.
తన, మన బేధం లేకుండా నిస్వార్ధంగా, నిజాయితీగా, రాజ్యాంగం ప్రకారం అని బోల్డన్ని ప్రమాణాలు చేసిన మంత్రిగారు కొడుకు కోసం తన పలుకుబడిని అడ్డేశాడాని చాలా మంది అనుకుంటున్నారు. అందులో మొదటగా బాధితురాలిని మేనేజ్ చేశాడు. మీడియా ముందు…సుశీల్ తప్పు చేశాడు, సుశీల్కి శిక్షపడాలి అని నినదంచిన ఆ మహిళ…హైకోర్ట్లో మాత్రం సుశీల్ ఎవరో నాకు తెలియదంది. తెరవెనుక ఏం జరిగి ఉంటుందో మీరూ ఊహించగలరు. బలం, బలగం లేని మహిళ కాబట్టి మంత్రిగారికి ఎదురునిలబడలేకోపోయింది అనుకోవచ్చు. మరి పోలీసులు ఏం చేశారు? సిసి టివి ఫుటేజ్లో స్పష్టమైన ఆధారం ఉందిగా అంటారా? అవన్నీ తారుమారు కావడానికి ఎంతటైం పడుతుందో చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఇలా మంత్రిగారి గురించి, మంత్రిగారి కొడుకు గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more