జనతా పరివార్ విలీనానికి ఆదిలోనే హంసపాదు పడింది. 80వ దశకంలో దేశాన్ని పరిపాలించిన జనతాపార్టీకి పూర్వవైభవం సాధించేందుకు, దాన్నుంచి వేరుపడిన ఆరు ప్రధాన పార్టీలను విలీనం చేయాలన్న ప్రయత్నాలకు తొలి అడ్డంకి ఎదురైంది. ఉత్తర ప్రదేశ్లో అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ విలీనం ప్రక్రియకు మోకాలడ్డుతోంది. బీహార్ ఎన్నికల్లోపు జనతా పరివార్ విలీనం అసాధ్యమని ఆపార్టీ తేల్చి చెప్పింది. ‘పరివార్ విలీనం ప్రక్రియ సాంకేతిక అంశాల కారణంగా ప్రస్తుతానికి నిలిచిపోయింది.
బీహార్ ఎన్నికల్లోపు విలీనం దాదాపు అసాధ్యమే. ఒకవేళ అలాంటి ప్రక్రియ ఏదైనా చేపడితే, అది మా పార్టీకి మరణశాసనమే’ అని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఈయన మాటల ద్వారా జనతా పరివార్ విలీనం ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నట్లే భావిస్తున్నారు. కొత్త జనతాపార్టీ పతాకం, ఎన్నికల గుర్తు తదితరాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీలో రాంగోపాల్ యాదవ్ కూడా ఒకరు. ఆయనే, ఇప్పుడు విలీనం సాధ్యం కాదని ప్రకటించడం పరివార్లో కలవరాన్ని కలిగిస్తోంది.
ఎస్పీ నేత వ్యాఖ్యలపై స్పందించిన శరద్యాదవ్, ములాయంను తమ అధినేతగా ఎన్నుకున్నామని, ఏ ప్రకటన అయినా చేసే అధికారం ఆయనదేనని అన్నారు. జనతా పరివార్ విలీనానికి, ఎస్పీ మోకాలడ్డడానికి పార్టీలో వ్యతిరేకతే కారణమని భావిస్తున్నారు. బీహార్ ఎన్నికల్లోపు విలీనమైతే, ఆర్జేడీ, జేడీయూలకే లాభం తప్ప తమకు ఒరిగే ప్రయోజనమేదీ లేదని పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. పైగా, విలీనం వల్ల, దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్ ప్రజలందరికీ చిరపరిచితమైన పార్టీ ఎన్నికల గుర్తును కోల్పోయే ప్రమాదం ఉందని, దానివల్ల ఓటర్లు అయోమయానికి గురైతే, సొంత రాష్ట్రంలో తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more