కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అడుగు జాడల్లో నడుస్తున్నాడంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ అమె ఉత్తరప్రదేశ్లోని అమేథీ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత మూడు నెలలుగా సొంత నియోజకవర్గంలో పర్యటించలేదని అన్నారు. రెండు నెలలు అజ్ఞాతంలో ఉండి వచ్చిన రాహుల్ అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలలో ఎంపీగా గెలుపొందిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే నిమోజకవర్గంలో రాహుల్ పర్యటించారని స్మృతి ఎద్దేవా చేశారు. తాను ఇవాళ అమేధీలో పర్యటిస్తునందునే రాహుల్ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారని అయన కార్యాలయం తెలిపిందని, అయితే ఈ విషయంలో తనను రాహుల్ ఫాలో అవ్వడం పట్ల సంతోషిస్తున్నానన్నారు.
ఇంతవరకు బాగానే రాహుల్ రెండు నెలలు ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం విషయాన్నే ఇప్పుడు అధికార పక్షం అస్త్రంగా మలుచుకుని ప్రచారం చేయడం పట్ల కాంగ్రెస్ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నన్నాళ్లు రాహుల్ ఎప్పుడైనా సెలవుపై వెళ్లారా..? అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు కేంద్రమంత్రిగా వుంటూ.. బెంగళూరులో జరిగిన పార్టీ పదాదికారులు సమావేశానికి అమె హాజరుకాకపోవడం.. పార్టీ పట్ల అమెకున్న అంకిత బావాన్ని తెలుపుతుందని ఎద్దేవా చేశారు. రెండు నెలల పాటు సెలవులో వెళ్లిన తమ నేత అడుగుజాడాల్లో కేంద్రమంత్రి ఫాలో అయ్యారని.. ప్రధాని నుంచి పార్టీ ముఖ్యనేతలందరూ హాజరైన కార్యక్రమానికి హాజరుకాకుండా.. భర్తతో కలసి రెండు రోజుల పాటు గోవా పర్యటనలో గడిపారని విమర్శిస్తున్నారు. అయితే మరికోందరు యూపీఏ ని ఎన్డీఏ ఫాలో అవుతందని విమర్శిస్తుండగా, ఇంకోదరు మాత్రం ఎవరు ఎవర్నీ ఫాలో అవుతున్నారో ఎవరికి ఎరుక అంటూ.. మీరు మీరూ విమర్శలు చేసుకోవడం మాని.. ప్రజల కోసం పనిచేయాలని హితవు పలుకుతున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more