సమైక్య రాష్ట్రంలో మూతబడిన రిక్రియేషన్ కేంద్రాలను నవ్యాంధ్రలో మళ్లీ తెరిచేందుకు తెరచాటు వ్యవహారాలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కోనసాగిన సమయంలో రిక్రియేషన్ కేంద్రాలపై కొరడా ఝుళిపించారు. అప్పటి నుంచి అమల్లోకి వచ్చిన అదేశాలను రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాలలో కోనసాగుతున్నాయి. రిక్రియేషన్ కేంద్రాల పేరిట పేకాట క్లబ్బులను నడుపుతూ.. క్లబ్ యాజమాన్యాలు..డబ్బులు సంపాదిస్తుండగా, వాటిలో అడి కుదేలైన అనేకులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికోందరు ఇళ్లను గుల్ల చేసుకుంటున్నారన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తడంతో రిక్రియేషన్ క్లబ్ లు మూతపడ్డాయి.
అయితే అప్పడు ప్రతిపక్షంలో వుండి నిమ్మకున్న టీడీపీకి చెందిన పలువురు నేతలు.. ఇప్పుడు తమ పార్టీయే అధికారంలోకి వచ్చేసరికి.. అప్పనంగా వచ్చే ఆదాయంపై దృష్టి సారించారు. వీటిని తెరిపించేందుకు భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుస్తున్నారు. ఈ విషయాన్ని సీరియన్ గా తీసుకున్న ఓ టీడీపీ నేత ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన జిల్లా పరిషత్ స్థాయి నేత కన్ను వీటిపై పడింది. తనకు ప్రధాన అనుచరుడు, ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో నేతతో కలసి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మూతపడిన పేకాట క్లబ్బులను తెరిపించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. క్లబ్బుల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్న ఆ నేత, లోకల్ నుంచి హైదరాబాద్ వరకూ భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెపుతున్నారని సమాచారం.
రెండు నెలల క్రితం కృష్ణా జిల్లాలో రెండు క్లబ్బులు పునఃప్రారంభం కాగా, పోలీసులు ఒకదాన్ని మూయించారు. రాజకీయ నేతల ఒత్తిడి అధికమవ్వడంతో.. అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. కాగా, ఒక్కసారిగా కాకుండా గుట్టుచప్పుడు కాకుండా మెల్లిగా ఒక్కో క్లబ్ ఏర్పాటు చేసుకుంటామని టీడీపీ నేతలు అధికారులకు, పోలీసులకు హామి ఇస్తున్నారు. తీవ్రస్థాయి రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో స్థానిక అధికారులు కొన్ని క్లబ్బుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more