ఇప్పటి వరకు హుస్సెన్ సాగర్ నీరే కలుషితమైంది. ఇక కేసిఆర్ రాకతో.. హైదరాబాద్ నగరం మొత్తం కలుషితమవుతుందని టీడీపీ నాయకుడు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ..ఏ సమయంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడో తెలియదు గానీ అప్పటి నుండి.. తెలుగు ప్రజల మద్య విభేదాలు, విమర్శలు మొదలయ్యాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. కేసిఆర్ సీఎం పదవి చేపట్టిన నాటి నుండి.. హైదరాబాద్ నగరం విద్వేషనగరం మారిపోయిందని సోమిరెడ్డి అంటున్నారు. ఉద్యమం చేసిన రోజుల్లోనే కేసిఆర్ తీరు బాగుందని, తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తరువాత తల, తోక లేని నిర్ణయాలు తీసుకుని, కక్ష సాధిస్తున్నారని తెలంగాణ టీడీపీ నాయకులు అంటున్నారు.
సీఎం కేసిఆర్ ఆంద్రోళ్ల మీద కక్షతో, పగతో రగిలిపోతున్నాడని అనటానికి ఆయన చేసిన పనులే కారణమని అంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాద్ లో జరిగిన విషయాలు .. 1) పెద్ద పెద్ద వారి వదిలిపెట్టి, కష్టపడి పైస పైసా కుడబెట్టుకొని ఇల్లు కట్టుకున్న వారి ఇళ్ల ను నెలమట్టం చేయటం. 2) ఆంద్రాకు రావాల్సిన నీటి ఆపి వేయటం. 3) నగరంలో చదువుకుంటున్న విద్యార్థుల మనసు పై ఫీజు దెబ్బ కొట్టడం 4) తండ్రి ముఖ్యం కాదు.. తాత ఉండాలని చెప్పటం. 5) ప్రజా మీడియా పై సవతి ప్రేమ చూపించటం. 6) ఉద్యోగులను రెచ్చగొట్టడం లాంటి పనులు సైలెంట్ గా చేస్తూనే.. పైకి మాత్రం నాకు ఏం తెలియదు.. నాకు అధికారం లేదు అని మీడియా సీఎం కేసిఆర్ కొంగజపం చేస్తున్నాడని టిడిపి సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేసిఆర్ సర్కార్ ఒక్క విశ్వనగరంగా చేస్తామని చెబుతూనే హైదరాబాద్ ను విద్వేష నగరంగా మార్చుతున్నారని అంటున్నారు. ముప్పై , నలబై ఏళ్ల క్రితం వచ్చి హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలల్లో అనేక రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు వారు ఏ రాష్ట్రానికి చెందినవారు అవుతారని సోమిరెడ్డి కేసిఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ పేరుతో.. పేద పిల్లలు అన్యాయం చేయవద్దని కేసిఆర్ ను సోమిరెడ్డి కోరుతున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more