సీమాంద్రలో పూర్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవనాలు వీస్తున్నాయి. పవన్ చేసిన ప్రసంగాల ఫలితం చాలా భారీ స్థాయిలో పెరిగిపోయింది. అలాగే రాష్ట్ర విభజన ఏర్పాటు జరిగిన నాటి నుంచి సీమాంద్రాకు ముఖ్యమంత్రి నేనే అని చెప్పుకుంటూ.. చీకటి రాజకీయాలు చేస్తున్న యువ నేత పై పవన్ ఎఫెక్ట్ బాగా పడిందని ..రాజకీయ మేథావులు అంటున్నారు.
‘‘చెట్టు మీద ఉన్న పిట్టకు . ముందే మసాలా నూరినట్లు ’’ సీమాంద్ర లో ఎన్నికల ముందు నుంచి ముఖ్యమంత్రి పదవి పై ఆశలో పెట్టుకొని ఊహాల్లో ఊరేగుతున్న అవినీతి రాజకీయ నేతకు.. పవన్ స్ట్రోక్ తగిలి గిల గిల కొట్టుకుంటున్నాడని సీమాంద్ర ప్రజలు అంటు్నారు.
సీమాంధ్రలో పరిస్థితులు గడిచిన రెండు మూడు రోజులుగా బాగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బాబు-మోడీ-పవన్ల త్రయం రెండు రోజుల్లో విస్తృతంగా ఆ మూల నుంచి ఈ మూల దాకా సభలు పెట్టడం, స్వర్ణాంధ్ర కావాలో స్కామాంధ్ర కావాలో తేల్చుకోండని చెప్పని మాటలు జనాన్ని ఆలోచనలో పడేసినట్లు సర్వేలు చెబుతున్నాయి.
తెలంగాణ సాఫ్ట్ వేర్ క్యాపిటల్ అయితే సీమాంధ్రను హార్డ్ వేర్ క్యాపిటల్ చేద్దామని మోడీ చెప్పిన మాట విద్యావంతులకు చాలా నచ్చింది. తీర ప్రాంతం ఉన్న తూర్పు చైనా హార్డ్ వేర్ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తోంది. అచ్చంగా సీమాంధ్ర కూడా తూర్పు చైనా లాగే ఉంది. అందుకే హార్డ్ వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో సీమాంధ్రను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి అవకాశం ఉంది.
బాబు, మోడీ హామీలు తటస్థులైన విద్యావంతులైన ఎన్డీఏ వైపు రప్పిస్తే పవన్ కల్యాణ్ పంచ్ లతో యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. తెలంగాణాను వైఎస్ కుటుంబం దోచుకోవడం వల్లే గడిచిన పదేళ్లలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి వెళ్లిందని పవన్ చెప్పడం రెండు రాష్ట్రాల్లోని ప్రజలను ఆలోచింపజేసిందని రాజకీయ నాయకులు అంటున్నారు.
తెలంగాణను దోచేసిన వైఎస్ కుటుంబాన్ని కేసీఆర్ ఒక్క మాట అనరని, అలాగే సీమాంధ్ర ప్రజల్ని నానా మాటలు అనే కేసీఆర్ ని , జగన్ పొరపాటున కూడా ఒక మాట అనరు అని పవన్ చెప్పిన అంశం వంద శాతం నిజం అని సీమాంద్ర ప్రజలే అంటున్నారు.
ఇద్దరు కుమ్మక్కై రాష్ట్రాన్ని విడదీసి చెరో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒప్పందం చేసుకున్న విషయం రాజకీయ అవగాహన ఉన్న వారందరికీ తెలిసిందే. ఈ మాట చెప్పిన వారిపై వైసీపీ నేతలు పేపర్ ద్వారా, టీవీ ద్వారా అదే పనిగా దాడి చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పవన్ మీద కూడా అలాగే ప్రేలాపనలు పేలుతూ.. ఆ పార్టీ పరువు తీసుకుంటాన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆ పార్టీ కార్యకర్తలే గ్రామాల్లో గుసగుసలాడుకుంటున్నారు.
సీమాంధ్రలో పవన్ అంటే ఆయన సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల వారికి కూడా ఎంతో అభిమానం ఉన్న విషయం తెలిసిందే. పవన్ ఒక తిక్కలోడు అతనికేమీ తెలియదని కొందరు దుష్రచారం చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన ప్రసంగం తరువాత కూడా ఆ మాట అంటే అజ్ఞానమనుకోవాలని .. ఆయన అభిమానులు అంటున్నారు.
ఇప్పటికే పవన్ దెబ్బకు గోదావరి, కృష్ణా డెల్టాల్లో వైసీపీకి భారీ నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ సినిమా అంటే చాలా పిచ్చి. పవన్ లాంటి పవర్ఫుల్ హీరో చేసే ప్రసంగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ పార్టీలు అంటున్నాయి. రెండు డెల్టాల్లో అత్యధికులు విద్యావంతులు కావడంతో ఏ అంశమైనా త్వరగా జనంలోకి వెళ్లిపోతుందని ..గ్రామాల్లో చదువుకున్న యువకులు అంటున్నారు.
ఈ నాలుగు జిల్లాల్లో 70 శాతానికి పైగా సీట్లు టీడీపీ-ఎన్డీఏ కూటమిలో పడతాయని ఇటీవల కొత్త గా ఓటు హక్కు వచ్చిన , యువతి, యువకులు అంటున్నారు. ఇక్కడ అందరు సరికొత్త మార్పు కోరుకుంటున్నారని.. సీమాంద్ర అభివ్రుద్ది కోరుకున్న ప్రజలు అంటున్నారు.
తన వ్యక్తి జీవితాన్ని వదులుకోని తెలుగు ప్రజల అభివ్రుద్ది కోసం నడుం బిగించిన .. జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ బరిలో దిగితే.. మేము మాత్రం .. అవినీతి పార్టీలకు, నాయకులకు. ఓటు వేయలేమని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. మా ప్రాంతం , మా కుటుంబం, మా బిడ్డల , మా భవిష్యత్తు గురించి పట్టించుకునే రాజకీయ పార్టీలు, నేతలనే మేము ఎన్నుకుంటామని.. సీమాంద్ర లోని చదవుకున్న యువత నడుం బిగించి రంగంలోకి దిగటంతో.. అక్కడ జగన్ పార్టీకి భారీ భారీ నష్టం జరుగుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more