ఇక్కడ కులం , మతం, డబ్బు ముఖ్యం కాదు. ప్రజలకు ఇప్పుడు ఈ మూడే చాలా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. దేశంలో హిందువులు, ముస్లీంలు, క్రిష్టియన్లు ఇంకా అనేక మతాల వారు కలిసి జీవిస్తున్నారు. కానీ రాజకీయలలో మాత్రం అలా కాదు. ఒకే కులం, ఒకే మతం, అనే మాటలు అనేక చోట్ల వినిపిస్తున్నాయి. మనకు రామయాణం, మహాభారతం లాంటి మహా కథలు..పుట్టాడానికి కొన్ని కారణాలు చెబుతారు. కానీ ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న రాజకీయలు మాత్రం అలా కాదు.
రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాత్రం ‘‘మా కులం, మా మతం, మా వాడు’’ అనే ఆయుధాలతో ఎన్నికల సమరంలోకి దిగితున్న రోజులివి. ఇలాంటి రోజుల్లోనే.. నాకు కులం, మతాలతో, సంబంధం లేదు, నా దేశం ప్రజలే, నా రాష్ట్ర ప్రజలే నాకు ముఖ్యం అని సాటి చెప్పిన ఏకైక సామాన్య నేత పవన్ కళ్యాణ్. ప్రతి మనిషి లో.. పది తప్పులు ఖచ్చితంగా ఉండాయి.. కానీ వారి వ్యక్తిగత జీవితానికి సంబంధానికి సంబంధించినవి. అలాంటి వాటిని అతి తెలివి కలిన మేథావులు భూతద్దంలో చూస్తారు.
ప్రతి మనిషి గుండె.. 60,70, 80, 90, 100 సంవత్సాలు నిరంతరంగా పనిచేస్తుంది. దేవుడు ప్రతి మనిషి పుట్టుకతో పాటే.. వారి ఎక్సెఫైరీ తేదీ కూడా రాస్తాడు. కానీ మనకు మన పుట్టిన రోజు గుర్తు పెట్టుకుంటాం, గానీ మనం మరణించే తేదీ గురించి అసలు ఆలోచించం. అసలు ఈ భూమీ మీద పుట్టినందుకు మనం ఏం చేస్తున్నమో మనకే తెలియదు, మనం ఏం సాదించాలో కూడా ఎవరికి తెలియదు గానీ, అయితే అతి తక్కువ మంది మాత్రం మన దేశంలో, మన రాష్ట్రంలో పుట్టినందుకు ఏదో చెయ్యాలి, నిస్వార్థమైన మనసుతో.. నా దేశానికి, నా రాష్ట్రానికి, నా ప్రజలకు నేను ఊపయోగ పడాలనే సంకల్పంతో ప్రజల ముందుకు వస్తారు.
కానీ ఇక్కడే..కుళ్లు రాజకీయాలతో..కులం, మతం , స్వార్థం, అవినీతి, డబ్బు , గర్వం, పదాలు ప్రత్యక్షంగా ప్రజల ముందు నాట్యం చేస్తుంటాయి. వీటిలో ఏ ఒక్క అర్హత ఉన్న నీవు ఆయా రాజకీయ పార్టీల నేతలతో కలిసి పోయే అశకాశం నీకు దక్కుతుంది. కానీ వీటిలో ఏ ఒక్క అర్హత నీకు లేకపోయిన.. నీపై ప్రస్తుత రాజకీయ నేతల విమర్శలు దాడి, కామెంట్లు , నీయొక్క వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి, యాగీ యాగీ చేయటం మొదలు పెడతారు. ఇది అవినీతి రాజకీయ నేతలు ఉపయోగించి పబ్లిసిటీ ప్లాన్. ఇలాంటి వాటిని దూరంగా పెట్టి, కేవలం ప్రజల కోసమే జన ప్రపంచంలోకి అడుగుపెట్టిన సామాన్య వ్యక్తి సినీ నటుడు పవన్ కళ్యాణ్.
ఇప్పటికి వరకు సినీ రంగం నుండి అనేక మంది సినీ నటులు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కానీ కేవలం ముగ్గురు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఆయా రాష్ట్రాల ప్రజలకు సుస్థిర పాలన అందించారు. ప్రజల గుండెల్లో ఇప్పటికి వారు చిరుస్థాయిగా నిలిచి ఉన్నారు. టాలీవుడ్ స్టార్ నందమూరి తారక రామరావు, కోలీవుడ్ నటుడు ఎం.జీఆర్. ప్రస్తుతం తమిళ ప్రజలకు సేవలు అందిస్తున్న నటి, జయలలిత. కానీ మిగిలిన నటులంత రాజకీయ పదవులు కోసమే రాజకీలయల్లో చేరి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. వీరి వల్ల ప్రజలకు పెద్దగా మేలు జరగలేదని నేటి రాజకీయలే చెబుతున్నారు.
ఇలాంటి సమయంలోనే జన స్రవంతిలోకి అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్. కులం, మతం, డబ్బు, స్వార్థం, పొగరు, ఆవేశం, తన అందమైన జీవితం.. అన్ని కలిపి కాశీ నదిలో వదిలి పెట్టి, కేవలం తెలుగు ప్రజల కోసం, దేశం కోసం .. రాజకీయ మాల పవన్ కళ్యాణ్ ధరించారు. ఈయన రాకతో.. కొన్ని రాజకీయ పార్టీలకు , నేతలకు పాదాల కింద భూమి వణికిపోయింది. వీరి గుండెల్లో వేగం పెరిగిపోయి.. బీపీ టాబ్లెట్లు మింగటం మొదలు పెట్టారు. అవినీతి నాయకుల పని చెప్పికాదు.. వారు నిత్యం మద్యానికి బానిసగా మరిపోయారు. కొంత మంది రంగంలోకి దిగి.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు పుస్తం రాసి రీసెంట్ గా మార్కెట్లోకి విడుదల చేయటం జరిగింది. మరీ కొంత మహిళ రాణులు మాత్రం తమ కంపు నోర్లు తెరిచి , పవన్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు పవన్ పై ఎలాంటి రాజకీయ విమర్శలు ఒక్కటి లేదు కానీ.. వ్యక్తిగత జీవితం.. చాలా మంది నాయకులు రాళ్లు విసిరారు. కానీ నేతలు విసిరిన ప్రతి రాయికి . పవన్ తనదైన శైలిలో సమాదానం చెప్పటం జరిగింది. కేవలం అవినీతి రాజకీయల నేతల వల్ల తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులను .. పవన్ చాలా దగ్గరు నుంచి చూడటం జరిగింది. అందుకే .. అవినీతి రాజకీయ నేతల, పార్టీలపై యుద్దం చేయటానికి ప్రజా నేతగా సిద్దమయ్యాడు. ఈ దారిలోనే తెలుగు రాష్ట్రం నుండి .. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, బిజేపి పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలుగు ప్రజల కోసం, జాతీయ పార్టీ పై చేసిన పోరాటం పవన్ కు కనిపించింది. ఇక్కడే కొంత మంది కుల గజ్జి గాళ్లు రంగం ప్రవేశం చేయటం జరిగింది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, కమ్మ వర్గానికి చెందిన వారు, అలాగే బిజేపి వెంకయ్య నాయుడు అదే వర్గానికి చెందటంతో ఇద్దరు పొత్తులకు తెరలేపటం జరిగిందని కొన్ని రాజకీయ పార్టీలు కొడైకూశాయి. అందులో బాగా పవన్ కళ్యాణ్ కాపు వర్గానికి చెందిన వారు కాబట్టి, రాజకీయంగా అణగతొక్కటానికి చాలా మంది అవినీతి రాజకీయ నేతలు చీకటి ప్రయత్నాలు చేయటం జరిగింది.ఎందుకంటే ‘‘ మొదటి నుండి రాజకీయల్లో రెండు వర్గాల నాయకులే రాజకీయలను ఏలుతున్న విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే ’’. మిగిలిన సామాజిక వర్గాల వారు మాత్రం రాజకీయల్లోకి పనికిరారు అనే మాటలతో రాజకీయంగా తొక్కివేయటం జరిగింది.
దేశం చరిత్రలో.. మొట్ట మొదటి సారిగా..కులం, మతం, ప్రాంతీయ పట్టింపు లేదని ‘‘జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతల్లో చూపించారు. నా తెలుగు ప్రజల కోసం, నా దేశం కోసం పాణాలు ఇవ్వటానికైన సిద్దం ప్రజల సాక్షిగా చెప్పిన వ్యక్తి పవనే. ప్రాంతీయాలు ముఖ్యం కాదు .. తెలుగు ప్రజలే ముఖ్యం అని చెప్పటం జరిగింది. రోజు రోజుకు ప్రజల్లో పవన్ పెరుగుతున్న మద్దతు , అభిమానం చూసిన జాతీయ నేతలు సైతం ఖంగుతిన్నారు. దీంతో రాష్ట్ర నాయకులతో కలిసి మంతనాలు జరిపి.. జనసేన పార్టీ మద్దతు కోసం పవన్ ఇంటి ముందు క్యూ కట్టారు. కొంత మంది రాజకీయ నాయకులైతే.. జనసేన పార్టీ మాకే మద్దతు ఇస్తుందని మీడియా ముందు గొప్పలు చెప్పుకున్నారు. కానీ చివరకు ప్రజలకు ఏ రాజకీయ పార్టీలతో, ఏ ప్రజా నేతలతో అభివ్రద్ది చెందుతుందో ఆయా పార్టీలకు పవన్ మద్ద ఇవ్వటం జరిగింది.
ఇక్కడే.. పవన్ అనేక విమర్శలు పురుడుపోసుకున్నాయి. ఈయన కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే, పార్టీ పెట్టి , ఎన్నికల్లో పోటీ చేయక ముందు తన పార్టీ కొన్ని కొట్లకు అమ్ముకున్నాడని.. ‘‘నరంలేని నాలుకతో ’’వాగిన నేతలు చాలా మంది ఉన్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి (ప్రజా రాజ్యం పార్టీ అధినేత) ఎన్నికల తరువాత అమ్ముకుంటే, పవన్ ఇప్పుడే అమ్ముకున్నారని, మేకప్పు నటులకు ఓట్లు రాలవని నేతలు మీడియా ముందు విమర్శలు చేయటం జరిగింది. అయితే పవన్ మాత్రం అన్ని విమర్శలను భరించి తన గమ్యం వైపు సాగిపోతున్నాడు.
రాజకీయ పదవుల కోసం నేను పార్టీ పెట్టలేదు, ముఖ్యమంత్రి పదవి అంతకంటే నాకు ఆశలేదు, ‘‘ కేవలం మీ అభిమానం కోసమే రాజకీయల్లోకి రావటం జరిగిందని ప్రజల ముందు నిజాయితీగా ఒప్పుకోవటం జరిగింది. అయితే ఇక్కడే రాష్ట్రాలని రాజకీయల రంగు పూర్తిగా మారిపోయింది. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, పది సంవత్సరాలు ప్రతిపక్ష హోదలతో రాజకీయ అనుభవం సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు, జాతీయ నేతగా గుర్తింపు పొందిన బిజేపి వెంకయ్య నాయుడు కలయిక కు.. జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ సపోర్టు దక్కటంతో.. ఇద్దరు కొత్త ప్రాణం పోసుకున్నారు.
ప్రధాని రేసులో దేశం మొత్తం పరుగులు తీస్తున్న బిజేపి నేత నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ కు పడిపోయాడు. జనసేన పవర్ మన పార్టీలకు చాలా అవసరమని గుర్తించిన నేతలు.. పవన్ పైనే పూర్తిగా ఆదారపడి పోయారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, పెంచుకున్న ఆశలను పవన్ ఒక్కసారి గా పెంచారు. దీంతో నరేంద్రమోడీ పవన్ తోనే కలిసి తిరుగుతూ 2014 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాజకీయలను పూర్తిగా మార్చటం జరిగింది.
కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు సైతం.. పవన్ పంచ్ దెబ్బలకు విల విలాడిపోయారు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ..‘‘గుంటకాడ నక్కలా కాసుకొని కూర్చున్న యువ రాజకీయ నేత ఆశలపై పవన్ నీళ్లు చల్లాటం జరిగింది. అసలే ఆ పదవి కోసం కుటుంబ సభ్యుల మొత్తాన్ని ఎన్నికల సమరంలోకి దించి , ఎండాలో తిప్పుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ‘‘అతడు అవినీతి సామ్రాజ్యానికి ..రారాజు’’. కోట్ల రూపాయాలతో..కుతంత్రాలు చేయగల సత్త అతనిలో ఉంది. కానీ పవన్ అభిమానాల ముందు అతని అవినీతి రాజకీయాలు పూర్తి పని చేయలదనే చెప్పాలి.
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు.. దేశ చరిత్రలో నిలిచిపోతాయి. తెలంగాణ రాష్ట్రం, సీమాంద్ర రాష్ట్రాల ఏర్పాటు .. ఈ ఎన్నికలే నిర్ణయిస్తాయి. కొత్త ప్రభుత్వాలను, నాయకులను ఎన్నుకోవటంలో.. ప్రజలతే ముఖ్య పాత్ర.. ఇప్పుడు ప్రజలు జనసేన వైపు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ‘‘నాయడు పార్టీకి ప్రాణం పోసిన నాయుడు’’ అనే నినాదం తెలుగు ప్రజలు మద్య వినిపిస్తున్నాయి. ఇది నిజమే అని రాజకీయ మేథావులు కూడా అంటున్నారు.
ఇది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనో, మా కులానికి చెందిన వ్యక్తి అనో, మా మతానికి సంబంధించి వ్యక్తి అని రాయటంలేదు. తెలుగు ప్రజలకు నేనున్నాను అని నిజాయితీగా చెప్పి ఒకే ఒక్క నేతల పవన్ కళ్యాణ్. తెలుగు ప్రజలు అభివ్రుద్ది కోసం ఏమైన చేస్తాను. అవసరమైతే నేను జైలుకైన వెళ్లటానికి సిద్దంగా ఉన్నానని చెప్పిన మొట్ట మొదటి రాజకీయ నేతల పవన్ కళ్యణ్. ఎలాంటి రాజకీయ నేతల బెదిరింపులకు నేను భయపడనని గర్వంగా చెప్పిన నేత పవన్ ఒక్కడే. ‘‘ఎన్నికల్లో సమయంలో కనిపించి.. ఏసీ రూమ్ ల్లో పడుకునే వ్యక్తి కాదు, ’’ ప్రజల కోసం ప్రజల సమస్యలపై నేను చనిపోయే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని సాటి చెప్పి తెలుగు జాతి పవర్ పుల్ నాయుడు పవన్ కళ్యాణ్ .
అధికారం కోసం, రాజకీయ పదవుల కోసం పాకులాడుతున్న ఈ రోజుల్లు.. పదవులు వద్దు, అధికారం వద్దు.. మీ అభిమానం ఉంటే చాలు జీవితాంతం సేవ చేస్తానని హామీ ఇచ్చిన నేత పవన్ కళ్యాణ్ . ఆయన ఆశించింది కేవలం ప్రజల అభిమానమే. దేశ ప్రజల్లో, తెలుగు ప్రజల్లో రాజకీయ మార్పు రావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ఆ మార్పు మన ఓటుతోనే సాధ్యపడుతుందని తెలుసుకోండి.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more