ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు వ్యవహారమే నడుస్తోందని ఆఆపా లక్ష్మీ నగర్ శాసన సభ్యుడు వినోద్ కుమార్ బిన్నీ తీవ్ర స్థాయిలో ఆరోపించటానికి కారణం ఏమిటో సర్వ విదితమే- ఆయనకి మంత్రిత్వ శాఖలో చోటునివ్వకపోవటం.
రాజకీయాల్లోకి వచ్చేదే నాలుగు రాళ్ళు వెనకేసుకోవటానికి. అందుకు అవకాశం ఇవ్వకపోతే పార్టీ నాయకత్వం మీద ఆగ్రహం రాదు మరీ. పార్టీకి లభించిన అధికారంలో కొంత మేర తమకూ వడ్డించినట్లయితేనే నాయకత్వానికి దీవెనలందుతాయి. లేదంటే శాపనార్థాలు, ఆరోపణలు, బెదిరింపులే మరి.
మంత్రివర్గంలోకి తీసుకోకపోతేనే బిన్నీ కినుక వహించి ఆమరణ దీక్ష చేస్తానని బెదిరించటం, పార్టీ వ్యవహారం ముందు చెప్పినట్లుగా లేదని ఆరోపించటం, ఇతర పార్టీలు చేసినట్లుగా కాంగ్రెస్ తో కుమ్మక్కయిన అభియోగాన్ని వేయటం, ఇతర పార్టీలతో సమావేశమవటం లాంటివి చూస్తుంటే ఆఆపా అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈయనగారికి మంత్రివర్గంలోకి తీసుకుని గురుతరమైన బాధ్యతలు అప్పగించకపోవటమే మంచిదైందని అనిపిస్తోంది.
ఇలాంటి వాళ్ళకే మంత్రి పదవి లభిస్తే పార్టీ చాలా మంచిదంటారు. ఎందుకంటే వాళ్ళకి మేసే అవకాశం లభిస్తుంది కాబట్టి. కానీ అలా జరగకపోవటంతో ఆ పార్టీ చెడ్డదైపోయింది. అవినీతికి ఎదురుగా నిలిచి పోరాటం చెయ్యటమే లక్ష్యంగా ఆవిర్భవించిన ఆఆపా మంత్రి పదవినిచ్చి అవినీతికి అవకాశం ఇస్తుందని ఆశించి, అది దొరకనందుకు చిర్రుబుర్రులాడుతున్న బిన్నీ లాంటి వాళ్ళని ఏరివేసిన అరవింద్ కేజ్రీవాల్ నిజంగా మెచ్చుకోదగ్గవారే.
ఎందుకంటే ఇలాంటివాళ్ళకి మంత్రిత్వ బాధ్యతలను అప్పజెప్తే వాళ్ళ అవినీతి దూకుడు ఎంతుంటుందో చెప్పలేం. అదంతా చెయిజారిపోతున్నదనే బాధే ఎక్కువ కనిపిస్తోంది- పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిన్నీని చూస్తే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more