తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీకి తానే సర్వం కావాలనే ఉద్దేశంతో నందమూరి వంశాన్ని తొక్కిపెడుతున్నారా.. గతంలో హరిక్రిష్ణ ను, ఇప్పడు బాలక్రిష్ణ ను అదే బాట పట్టిస్తున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో నందమూరి వంశాన్ని అడుగు పెట్టనీయ కూడదని నిశ్చయించుకున్నట్లు , అందుకే బాలయ్యను రాజ్య సభకు పంపాలను యోచిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
అయతే బాలయ్య మాత్రం ఈసారి ఎన్నికలలో తెలుగు దేశంలో కీలక పాత్ర పోషించాలని బావిస్తున్నారు. మొదటి నుండి పార్టీలో ఏకఛత్రాధిపతి అనే ముద్ర పడిన బాబు పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుకు వెన్నుపోటు పొడిచారనే వాదన ఎప్పటినుండో ఉంది. అదే విధంగా నందమూరి హరిక్రిష్ణను కూడా రాష్ర్ట రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు తెలివిగా రాజ్యసభకు పంపారనేది విధితమే. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో బాలయ్య పార్టీకి సన్నిహితంగా మెలుగుతూ తనకంటూ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ప్రత్యేక గుర్తింపు పొందే పనిలో ఉన్నారు.
అలాగే ఇందుకోసం అన్ని నియోజక వర్గాల నేతలను కలుస్తూ, తన అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించే దిశగా ఆలోచిస్తున్నారు. అయి తే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు తన బావ బాలయ్య వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పన్నే ప్రయత్నంలో ఉన్నట్టు పార్టీలోని కొంతమంది అంటున్నారు. నందమూరి వంశాన్ని అందలమెక్కిస్తే తనకే ముప్పు ఏర్పడుతుందిని భావించిన బాబు ఎప్పటికప్పుడు హరిక్రిష్ణ, బాలక్రిష్ణ, జూనియర్ ఎన్ టిఆర్ లపై నియంత్రిస్తూనే ఉన్నట్లు తెలసుస్తోంది.
అందు కోసమే ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలో నందమూరి వంశస్తులకు కీలక చోటు దక్కనీయకుండా కాపుకాస్తున్నట్లు భోగట్టా. ఇదిలా ఉంటే చంద్రబాబుకు జూనియర్ ఎన్ టి ఆర్ కు పొసగడంలేదని ఎప్పటి నుంచే మీడియాలో కథనాలు వినిపిస్తూ నే ఉన్నాయి. అదేవిధంగా హరిక్రిష్ణను తొక్కిపెట్టి ఉంచినట్లు అప్పుడప్పుడు వాద ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి.
రాష్ర్ట విభజన నేపథ్యంలో ఈ సారి ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్న తరుణంలో బాబు తన ఎన్నికల వ్యూహాన్ని ఎంతో పకడ్బంధీగా రచిస్తున్నారు. ఇటువంటి కీలక ధశలో బాలయ్యను, హరిక్రిష్ణను, జూనియర్ ఎన్ టి ఆర్ లను ప్రోత్సహిస్తే తనకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోని చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా విషయంలో అనుసరించిన వ్యూహాన్నే, నందమూరి వంశస్తుల విషయంలోనూ వర్తింపజేసి వారిని ఎన్నికల ప్రచారం కోసమే వాడుకోవాలను కుంటున్నారనే వాదన వినిపిస్తోంది.
Murthy
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more