ఓవైపు ఉద్ధానంలో హాట్ కామెంట్లు చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాస్త గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుంటున్న ఏం చర్చించుకుంటారో? అని డిస్కషన్లు మొదలుపెట్టేసుకున్నారు. రాజకీయాలా? లేక శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యలతోపాటు, హార్వర్డ్ యూనివర్సిటీ బృందంతో చేయించిన సర్వేలో వెలుగు చూసిన నిజాలను చంద్రబాబు ఎదుట ఉంచే అవకాశం ఉంచుతాడా? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.
ఇక మొదటిది జరిగినా జరగకపోయినా.. సమస్య మూలాలను మాత్రం సీఎం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని కోరే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ ఉద్ధానంలో నిర్వహించిన అధ్యయనం అంశాలను చంద్రబాబుకు పవన్ వివరించనున్నాడు. రక్షిత మంచినీటి ప్లాంట్లు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపైనా చంద్రబాబుతో చర్చించనున్నట్టు చెబుతున్నారు.
'నేను ప్రభుత్వాలకు కాదు...ప్రజలకు సేవ చేస్తా'నని పవన్ నిన్న విశాఖపట్టణంలో జరిగిన సింపోజియంలో ప్రసంగించిన విషయం తెలిసిందే. మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమని, సమస్యను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నప్పుడు దానిని పరిష్కరించకుండా విమర్శలు చేసుకుంటుండడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించాడు. తాను నిపుణుడ్ని కాదని, అయితే మనిషిగా, తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తినని తెలిపాడు.
ఎంతో మంది నిపుణులు, మేధావులు, పరిశోధకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించలేరా? అని ప్రశ్నించాడు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నాడు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశాడు. మరోవైపు ఉద్ధానం సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రతిపక్ష వైసీసీ సాయం కోరుతామన్న పవన్ ప్రకటన టీడీపీ నేతలను విస్మయ పరుస్తోంది. ప్రత్యేక హోదా పేరు చెప్పి వైసీపీకి పవన్ దగ్గరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more