అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది. ఎలా అందరిలోనూ నిరుత్సాహం. ఇంతలో ఒకరికి మంచి ఐడియా వచ్చింది. ఇటీవలే కొన్న తన కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అక్కడికి తెచ్చేశారు. ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసి స్కూటర్ లోని స్పీకర్ లకు కనెక్ట్ చేసి పాటలు పెట్టారు. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో బ్యాటరీ చార్జింగ్ అయి ఉంది. ఇంకేం స్కూటర్ లో-లైట్ ను ఆన్ చేసి వెలుతురు పెట్టుకున్నారు. స్పీకర్లలో పాటలు పెట్టుకున్నారు. ఆడా మగా అంతా కలిసి వలయంలా ఏర్పడి తిరుగుతూ గర్భానృత్యం చేశారు. అయితే పవర్ కట్ తో పూర్తి చీకటిగా మారింది. దీంతో.. ఆ వీడియో కాస్త మసకగా వచ్చింది. శ్రేయాస్ సర్దేశాయ్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్ అయింది. 47 వేలకుపైగా వ్యూస్ రాగా.. వందలకొద్దీ లైకులు కూడా వచ్చాయి. ‘‘నవరాత్రి ఉత్సవాల సమయంలో కరెంటు పోతే ఓలా ఎస్1 ప్రో ఆదుకుంది. ఓలా స్కూటర్ లోని స్పీకర్లు అవసరానికి బాగా పనికొచ్చాయి..’’ అని క్యాప్షన్ పెట్టారు.
‘ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇలా కూడా వాడొచ్చని మాకు తెలియదు’, ‘ఈ ఐడియా ఏదో చాలా బాగుంది..’ అని కొందరు అంటుంటే.. ‘నవరాత్రి ఉత్సవాలకు ఏది అడ్డు వచ్చినా ఆగేదే లేదు. వేడుకలపై వెనక్కి తగ్గేదే లేదు..’ అని అని మరికొందరు పేర్కొంటున్నారు. ‘‘సమస్య ఏదైనా, ఎలాంటిదైనా సరే.. దానికి కచ్చితంగా ఓ పరిష్కారం ఉంటుంది. ఇక్కడ వీళ్లు దాన్ని సరిగ్గా గుర్తించి పాటించారు.’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘ఓలా అంటే ప్రయాణం మాత్రమే కాదు. ఎంటర్టైన్మెంట్. అవసరమైనప్పుడు ఆదుకునే లైఫ్ సేవర్ కూడా..’’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు.
Ola S1 Pro turned out to be savior when lights were out during Navratri celebration . Every one enjoyed navratri with Ola's speakers #olas1pro #OLA @OlaElectric @bhash pic.twitter.com/Up319nXwVq
— Shreyas Sardesai (@shreyas7065) October 4, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more