నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 30 రోజుల్లోగా రద్దయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని, వీటిని ఏ రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలోనైనా జమ చేయవచ్చని ఫైనాన్స్ శాఖ ఓ అధికార నోటిఫికేషన్ వెలువరించింది. ఈ బ్యాంకుల ఖాతా క్రెడిట్ ద్వారా నోట్ల మార్పిడి విలువను తిరిగి పొందవచ్చని సూచించింది.
అయితే ఈ సదుపాయం కేవలం డిస్ట్రిక్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకులకు మాత్రమే కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం నవంబరులో రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లు తమ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్నాయని వాటిని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొరపెట్టుకున్నాయి. దీంతో వాటిని మార్చుకునేందుకు మరో అవకాశాన్ని ఇస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.
కాగా, నోట్ల రద్దు తరువాత కో-ఆపరేటివ్ బ్యాంకులు కూడా పాత నోట్లను డిపాజిట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై రద్దు గడువు ముగిసిన తరువాత కూడా ఆర్బీఐకి జమ చేయకుండా మిగిలిన నోట్లు వందల కోట్లు ఉన్నాయని విన్నవించుకుంది. తక్షణమే వీటిని మార్చకుంటే, రైతు రుణాలకు ఇబ్బందులు కలుగుతాయని బ్యాంకు యాజమాన్యాలు ఆర్బీఐకి మొరపెట్టుకున్నాయి. అయితే గతంలో ఇదే ప్రతిపాదనను ఆర్బీఐ నిరాకరించింది.
సుమారు 2,500 వేల కోట్ల పాత నోట్లు మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుల్లో అలాగే ఉండిపోయాయని శివసేన గళం ఎత్తింది. మంత్రి దిలీప్ రౌతే కూడా ఈ విషయంలో కేంద్రానికి లేఖ కూడా రాశాడు. అయితే రాష్ట్రపతి అభ్యర్థికి ఉద్ధవ్ థాక్రే మద్ధతు ప్రకటించటం, ఆ వెంటనే నోట్ల మార్పిడికి వెసులు బాటు కల్పిస్తూ ఆర్థిక శాఖ నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావటం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more