నిండా పాతికేళ్లు కూడా లేని నిషిత్ నారాయణకు నూరేళ్లు నిండిపోవటంపై అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారు వేగం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువలో తక్కువ గంటకు 200 కిలోమీటర్ల పైన వేగంతో కారు ప్రయాణించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారు డ్యామేజ్ ను పట్టి మెట్రో ఫిల్లర్ ను ఎంత వేగంగా ఢీ కొట్టిందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి... మంత్రి నారాయణకు పుత్ర శోకం
ఇక ముందుభాగం మొత్తం నుజ్జు నుజ్జు కావటమే కాదు... ప్రమాద సమయంలో ప్రాణాల్ని రక్షించే ఎయిర్ బెలూన్లు సైతం పగిలిపో్యాయి. ప్రస్తుతం మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు నేతలు, ప్రముఖుల పరామర్శలు సాగుతున్నాయి. కేవలం అతి వేగమే వాళ్ల ప్రాణాలు తీసిందని వైద్యులు ధృవీకరించారు. యాక్సిడెంట్ అయిన పది నిమిషాల లోపే వాళ్లు ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే నిషిత్ నారాయణ మృతి నేపథ్యంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
నేతల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిపోయిందంటూ కామెంట్ చేశాడు. కల్చర్ పేరిట ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని, తప్పతాగి రోడ్ల మీద పడి ప్రాణాలు గొట్టుకుంటున్నారని ఆయన ఆక్షేపించాడు. యువకులు, వంశాన్ని ఉద్దరిస్తారని భావించిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త జీర్ణించుకోవడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు సమయం లేదనే సాకు చెప్పకుండా తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించాడు. ప్రభుత్వాలు కూడా కేవలం ఆదాయం కోసం చూసుకోకుండా రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని సూచించాడు. అయితే పోస్ట్ మార్టంలో వైద్యులు నిషిత్, రవివర్మ మద్యం సేవించి లేరని చెప్పటం తెలిసిందే.
నిషిత్ కు కొత్తేం కాదు...
అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే, అతివేగంగా కారు నడపడం నిషిత్ కు ఇదేమి తొలిసారి కాదని, గతంలో కూడా ఇదే విధంగా కారు నడిపాడని, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారని సమాచారం. ఈ ఏడాదిలోనే అతివేగంగా కారు నడిపినందుకు నిషిత్ మూడు సార్లు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత, మార్చి 1న మరోమారు గండిపేట వద్ద అంతే వేగంతో కారు నడుపుతూ, మార్చి 10న మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్ లో అతివేగంగా కారు నడిపినట్టు ట్రాఫిక్ పోలీసుల సమాచారం. ఆయా సందర్భాల్లో 150 కిలో మీటర్లకు తక్కువ కాకుండా వేగంతో నడిపినట్లు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more