ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైపోయింది. ఎన్నికల వేళ ప్రజలను ప్రలోభ పెట్టేందుకు డబ్బును ఎరగా వేసే అభ్యర్థులను రాజకీయాలకు దూరం చేసేలా పావులు కదుపుతోంది. ఈ మేరకు కేంద్రం సాయం కోరుతూ చట్టంలో అవసరమైన సవరణలు చేయాలంటూ కోరింది.
తమిళ నాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బును పంచేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి దినకరన్ బుక్కయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన పోలీసులకు సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగించి మరీ పంచటం ఆశ్చర్యం కలిగించింది. పలు రకాల మార్గాలను ఎంచుకోవటంతో ఇకపై విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటే చేసే అభ్యర్థులు ఓటర్లను డబ్బు, ఇతర కానుకలతో ప్రలోభపెట్టినట్లు కోర్టులో చార్జిషీట్ దాఖలైతే సదరు అభ్యర్థులపై ఐదేళ్ల వరకు అనర్హత వేటు వేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనుంది. దీనిపై న్యాయ శాఖకు లేఖ రాస్తున్నామని ఈసీ అధికారవర్గాలు తెలిపాయి.
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పాల టోకన్లు, ఫోన్ రీచార్జ్ కూపన్లు, పేపర్ల చందాలు, ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్ఫర్, మొబైల్ వాలెట్ పేమెంట్ల రూపంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టినట్లు ఈసీ గుర్తించింది. ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం అయితే ఆ ఎన్నికలను రద్దు చేసేలా అధికారాలు ఇవ్వాలని గతంలోనే ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఎన్నికల్లో అంగ బలం ప్రదర్శించిన సమయంలో ఈసీకి నేరుగా ఆ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంది. అర్థ బలం విషయంలో ఆర్టికల్ 324 ప్రకారం రాజ్యాంగ అధికారాల ద్వారా చర్యలు తీసుకోవచ్చు. అయితే వాటికి పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటితో అవసరం లేకుండానే చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more