ఫ్రెంచ్ బుల్ ఫైటర్ లియా విసెన్స్ పేరు వింటే చాలూ జంతు ప్రేమికులు మండిపడతారు. ఎందుకంటే ఆమె చేసిన పని అలాంటిది. స్పెయిన్ జరాగోజాలోని లా మిసెరికార్డియాలో ఎల్ పిలార్ ఫెరియా టోర్నమెంటు పేరిట దున్నపోతులను హింసించే అతి కిరాతకమైన క్రీడ జరుగుతుంది. గుర్రం మీద స్వారీ చేసే బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడిచి పొడిచి హింసిస్తారు. ఈ క్రీడలో భాగంగా 31 ఏళ్ల లియా విసెన్స్ గత ఏడాది గుర్రంపై స్వారీ చేస్తూ ఓ దున్నపోతును ఇలా పొడిచి పొడిచి చంపేసింది. అంతేకాకుండా ఆ దున్నపోతు చెవులను కోసి.. వాటిని గర్వంగా పట్టుకొని ఫొటో దిగింది. ఈ కిరాతకమైన ఫొటో చూసి జంతు ప్రేమికుల ఒళ్లు జలదరించింది. ఆమె తీరుపై వారు భగ్గుమన్నారు.
అయితే ఈ ఏడాది మాత్రం ఆమెకు భయానక అనుభవమే ఎదురైంది. ఎందుకంటే దాదాపు చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. గత శనివారం జరిగిన పోటీల్లో దున్నపోతును పొడిచే క్రమంలో అది చాకచక్యంగా తప్పించుకుంది. అంతేకాదు చివరికి గుర్రం మీద నుంచి లియాను కిందపడేసి కుమ్మేసింది. కాస్తుంటే అది ఆమెను పొడవబోయిదే. కానీ, కొంచెంలో కోమ్ము మిస్సయ్యింది. వెంటనే నిర్వాహకులు అప్రమత్తం ఆమెను బయటికి లాగేశారు. మొత్తానికి గతేడాది ఆమె చేసిన పనికి ఇప్పుడు ఈ దున్నపోతు మంచి బుద్ధి చెప్పిందని జంతు పరిరక్షణ ఉద్యమకారులు అంటున్నారు.
స్పెయిన్ లోని జరగోజాలో ప్రతీయేడు ఈ హింసాత్మక టోర్నమెంట్ జరుగుతుంది. ఆనందం పేరిట వందల కొద్ది మూగజీవాలను బలి తీసుకుంటారు. వాటిని క్రూరంగా పొడిచి పొడిచి చంపి ఆపై తోక, కొమ్ములను కత్తిరిస్తుంటారు. ఇక టోర్నమెంట్ లో పాల్గొనే వారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్ లో పైరెట్ అని పేరొందిన జువాన్ జోస పడిల్లా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఒక కన్ను కోల్పోయాడు. స్పెయిన్ లో బుల్ ఫైట్ పై బ్యాన్ విధించాలన్న డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి హింసాత్మక క్రీడను కూడా నిషేధించాలన్న అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more