రంగారెడ్డి జిల్లా మొయినాబాదు శుక్రవారం ఉదయం గన్ ఫైర్ చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి చేతిలోని గన్ మిస్ ఫైర్ కావటంతో ఆయన మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు కానిస్టేబళ్లకు గాయాలయ్యాయి.
ఫైరింగ్ రేంజ్ లోని ఇండోర్ గ్రౌండ్ లో లో తుపాకీని శుభ్రం చేస్తున్న క్రమంలో వాసుదేవరెడ్డి చేతిలోని తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకువచ్చింది. ఈ బుల్లెట్ గాయం కారణంగా వాసుదేవరెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. మిస్ ఫైర్ లో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అధికారులు ఈ విషయానికి సంబంధించి గోప్యత పాటించడంతో వాసుదేవరెడ్డి మరణం వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వివరాలు వెల్లడించేందుకు ఇంటలిజెన్స్ వర్గాలు నిరాకరించడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more