దేశవ్యాప్తంగా ఇవాళ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకుల ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు మొత్తం 40 పైగా ప్రభుత్వ రంగ, పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఆయా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు మొదలైన వాటిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. పరిస్థితి తీవ్రతను అన్ని వర్గాల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సమ్మె తలపెట్టినట్లు సమాచారం. అయితే, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర కొత్త తరం బ్యాంకులు యథాప్రకారం పనిచేయనున్నాయి.
కీలకమైన తొమ్మిది యూనియన్లలో సభ్యత్వమున్నవారంతా సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు తెలిపారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 80,000 పైచిలుకు శాఖల్లోని ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు’ అని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా బ్యాంకింగ్ రంగంలో నిర్హేతుక సంస్కరణల అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాంబాబు విమర్శించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో అయిదు బ్యాంకుల విలీనాన్ని (ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్) ఆయా బ్యాంకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మొదలైన వాటిని కూడా వ్యతిరేకిస్తూ యూనియన్లు ఈ నెల 12, 13న రెండు రోజుల స్ట్రయిక్ తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా దాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more