తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ లీక్ వ్యవహారంలో సీఐడీ విచారణలో నమ్మలేని విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ జేఎన్టీయూలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో ప్రింటింగ్ ప్రెస్ నుంచే కశ్చన్ పేపర్లు లీక్ అయిందని తెలిసి అధికారులు షాక్ తిన్నారు . అంతేకాదు ఈ తతంగం వెనుక దయాకర్ అనే వ్యక్తి హస్తముందని గుర్తించారు.
దయాకర్ కుమార్ కూతురికి గతేడాది ఎంసెట్ పరీక్షలో 23 వేల ర్యాంకు రాగా, ఈ సంవత్సరం మాత్రం 13వ ర్యాంకు వచ్చింది. ఆమె యావరేజ్ స్టూడెంట్ అని తెలుసుకున్న అధికారులు ఎంక్వెరీ చేయగా మొత్తం డొంక అంతా కదిలింది. ఈమెతోసహా వరంగల్, ఖమ్మంకి చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థుల ర్యాంకులపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరంతా చదువులో అంతంత మాత్రంగా ఉన్నా టాప్ ర్యాంకులు రావటం, ప్రస్తుతం అంతా ఎక్కడున్నారో తెలీకపోవటంతో ఈ లీకేజీ బాగోతం వెనుక వీరే ఉండి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు.
ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో ఇద్దరు కాంట్రాక్టు లెక్చర్లను విచారిస్తున్నారు. కాగా, పేపర్ లీక్ అయినట్టు ఫిర్యాదు అందుకున్న పోలీసులు నాలుగు రోజుల తర్వాత క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసీఆర్ సర్కారు ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు ఒక్కో విషయాన్ని వెల్లడిస్తామని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more