మన దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఏది? బీజేపీ అని చిన్నపిల్లాడైన టక్కున చెప్పేస్తాడు. మరీ దాని గుర్తు... ఇది మరీ టూమచ్ కాషాయంలో కమలం ఇదైనా ఎవరైనా తేలిగ్గా చెప్పేస్తారు అంటారా?. కావొచ్చు కానీ, భవిష్యత్తులో అది మారే సంకేతాలు ఉన్నాయనే చెప్పొచ్చు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీకి అర్థాంతరంగా అంత అవసరం ఏం వచ్చిందనేగా....
‘జన సంఘ్’గా చిన్న కాలువలా ప్రయాణం మొదలెట్టి ఆ తర్వాత ‘భారతీయ జనతా పార్టీ’గా రూపాంతరం చెందిన ఈ పార్టీ అనతికాలంలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం కేంద్రంలోనే కాక మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బలమైన పార్టీగా ఆవిర్భవించింది. అసలు జాతీయ పార్టీల్లో వామపక్ష పార్టీలను తోజేసి మరీ కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానం ఆక్రమించింది కమలం. అలాంటి పార్టీకి ఇప్పుడు చిహ్నంతోనే పెద్ద చిక్కు వచ్చి వచ్చిపడింది.బీజేపీకి అసలు ‘కమలం’ గుర్తు ఎలా కేటాయించారంటూ సామాజిక ఉద్యమకర్త హేమంత్ పాటిల్ బాంబే హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాడు.
జాతీయ చిహ్నంగా ఉన్న ‘కమలం’ ను రాజకీయ పార్టీకి కట్టబెట్టడం సరైందని కాదని అందులో ఆయన ఉద్దేశ్యం. అంతేకాదు కమలం’ గుర్తును ఎన్నికల చిహ్నంగా వాడుకుంటూ బీజేపీ ‘‘ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ (ప్రివెన్షన్ ఇంప్రాపర్ యూజ్) యాక్ట్, 1950’ ఉల్లంఘిస్తోందని కూడా పాటిల్ ఆరోపిస్తున్నారు. కావాలంటే ఇంకో గుర్తును ఆ పార్టీకి కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన బాంబే హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం వచ్చే వారం విచారణ చేపట్టనుంది. 25 ఏళ్ల క్రితం ఎన్నికల కమిషన్ దానికి కమలం గుర్తుగా కేటాయించింది. అయితే ఇందులో బీజేపీకి పెద్ద చిక్కులు ఎదురు కాకపోవచ్చనే న్యాయ నిపుణులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more