నెల జీతం కాస్త ఒకట్రెండు రోజులు ఆలస్యమైతే ఎన్ని ఇబ్బందులో? ఇంటి అద్దె నుంచి సరుకుల వరకు సర్దుబాటు చేయడం తల ప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది 20 నెలలుగా జీతమే రాకుంటే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తిరుపతిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న వారు జీతాల్లేక, జీవనాధారం కోసం అప్పులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. వెంటనే జీతాలివ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. తిరుపతిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రభుత్వం చిన్నపిల్లల ఆసుపత్రిని ఏర్పాటు చేసింది.
ఈ ఆస్పత్రికి కాంట్రాక్టు ప్రాతిపదికన నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లను నియమించారు. వీరికి 9 నెలల పాటు ఎన్ఆర్హెచ్ఎం గ్రాంటు కింద నెలకు రూ.5 వేల నుంచి రూ. 6 వేలను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి చెల్లించారు. ఆ తర్వాత నిధులు విడుదల కాలేదు. అప్పటి నుంచి జీతం ఆగిపోయింది. చిన్నపిల్లల ఆస్పత్రిలో అత్యవసర కేసులకు 24 గంటలూ వీరు అందుబాటులో ఉండి రక్తం, మలం, మూత్రం ఇతరత్రా పరీక్షలు నిర్వహిస్తారు. కానీ 20 నెలలుగా జీతం అందకున్నా వచ్చే నెలైనా ఇస్తారులే అని సర్దిచెప్పుకొంటూ పనిచేస్తున్నారు. రెగ్యులర్ చేస్తారన్న ఆశ కూడా వీరి చేత జీతంలేకుండా పని చేయిస్తోంది. ఇకనైనా అధికారులు స్పందించి ల్యాబ్ టెక్నీషియన్లకు జీతాలిచ్చేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more