పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం సంకటకంలో పడింది. ఈ పరీక్ష ఉన్న ఊరికి ఏలుతున్న కేంద్రానికి సవాల్గా తయారైంది. సీమాంధ్ర ఎంపిలు అవిశ్వాసానికి నోటీసు ఇవ్వడంతో చిత్తూరు జిల్లాలోని లోక్సభ సభ్యులు రెండులా చీలిపోయారు. దీంతో జిల్లాలో రాజకీయ చర్చలు మరోమారు తెరపైకి వచ్చాయి. ఇక ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంటుందోననే అంశం కూడా వేడెక్కుతోంది. ఇంతకీ జిల్లా రాజకీయ కుంపటి ఎలా ఉందో చూద్దాం.
కోస్తాంధ్ర జిల్లాల్లో చిత్తూరు జిల్లా కీలకమైంది. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. రాష్ట్రాన్నిపాలిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ జిల్లా వాసులే. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి, పీలేరు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో సీఎం జై సమైక్యాంధ్ర అంటుంటే, చంద్రబాబు నాయుడు సమన్యాయం అనే నినాదంతో రాష్ట్రంలో వేడెక్కిస్తున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం వరకూ వేచిన చూసిన సీమాంధ్ర ఎంపిలు కేబినెట్ నిర్ణయం రాష్ట్ర విభజనకే పూనుకోవడంతో ప్రభుత్వాన్ని కూలదోయడమే ఖచ్చితమైన నిర్ణయమనే నిర్ణయానికి వచ్చేశారు. వీరికి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తూరు జిల్లా ప్రధాన భూమిక పోషించిందనడంలో అనుమానం లేదు. ఇటు ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులలో పెద్ద ఎత్తున స్పందన ఉంటే వైకాపా నాయకులు మినహా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలలో అనుకుంత స్పందన లేదు. ఇలాంటి తరుణంలోనే ఒక కేంద్రంలో అవిశ్వాసం, శాసన సభలో తెలంగాణపై చర్చ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ప్రజాప్రతినిధులు మనోగతం విచిత్రంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు.
విశ్వాసానికి అనుకూలంగా శివ ప్రసాద్
తెలుగుదేశం పార్టీ తరపున చిత్తూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొందిన శివప్రసాద్ మాత్రం మొదట నుంచి సమైక్య గళం వినిపిస్తూనే ఉన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై ఓ నిర్ణయానికి రాక ముందు నుంచే శివప్రసాద్ మాత్రం తన వాణి బాణీ సమైక్యాంధ్ర ప్రదేశ్కు అనుకూలంగానే వినిపిస్తున్నారు. పార్లమెంటులోనూ, బయట వివిధ కార్యక్రమాలతో దేశ స్థాయిలో రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ప్రస్తుతం కూడా అవిశ్వాస తీర్మాన నోటీసుపై సంతకం చేసి చిత్తూరు జిల్లా వాసుల భావాలకు అనుకూలంగా నడుచుకుంటున్నారు.
ఎమ్మెల్యేల బాట ఎటో?
చిత్తూరు జిల్లా నుంచి 14 శాసనసభా స్థానాలుంటే వాటిలో 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు తెలుగుదేశం వారు కాగా 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక మిగిలిన ఒక్కరు వైకాపాకు సంబంధించిన వారు. అయితే వీరిలో వైకాపా ఇప్పటికే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. శాసనసభలో తమ వాణి వినిపించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒక్క సికేబాబు, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే బహిరంగంగా అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వస్తున్న తరుణంగా అధిష్టానం తాయిలాలకు లొంగుతారా. ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటారా అనే అంశంపై వేచి చూడాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more
Nov 29 | పద్మావతి అమ్మవారికి కంఠాభరణం పద్మావతి అమ్మవారికి బంగారంతో తయారు చేసిన కంఠాభరణాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు రాత్రి బహూకరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కానుకను అందజేసినట్లు కనుమూరి తెలిపారు. ... Read more