కర్ణాటక పోలీసులు వ్యవహరించిన తీరుతో హైడ్రామా చోటుచేసుకుంది. మదనపల్లె నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేట్ బస్సు బయల్దేరింది. పెద్దపంజాణి మండలం రాజుపల్లె చెక్పోస్టు వద్దకు బస్సు చేరుకోగానే అక్కడ కాపు కాసి ఉన్న కర్ణాటక పోలీసులు ఆపి సోదాలు చేశారు. బస్సులోని రెండు బ్యాగులను స్వాధీనం చేసుకుని పోలీస్ జీపులో ఉంచారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి విలేకరులు అక్కడికి చేరుకుని పోలీసుల అనుమతితో ఫోటోలు తీశారు. విషయం తెలుసుకున్న ఓ ఉన్నతాధికారి విలేకరులపై దౌర్జన్యం చేసి కెమెరాలు లాక్కొని అందులోని ఫోటోలను తొలగించారు. ఆ బ్యాగుల వద్దకు బస్సులోని ప్రయాణికులనుగానీ, విలేకరులను గానీ వెళ్లనివ్వలేదు. మరో రెండు రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడికి తరలించేందుకు భారీగా నగదు గానీ, పేలుడు పదార్థాలు కానీ బ్యాగుల్లో ఉంటాయని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పెద్దపంజాణి ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకునే లోపు కర్ణాటక పోలీసులు అక్కడి నుంచి జారుకోవడంతో అనుమానం మరింత పెరుగుతోంది. అయితే బస్సులో లభించిన రెండు బ్యాగుల్లోనూ జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయని మాత్రమే చెప్పినట్లు కొందరు చెబుతున్నారు. బ్యాగులను తీసుకెళ్తున్న బస్సును నంళి పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు సమాచారం. అయితే బ్యాగులు ఎవరివి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more