Karnataka police hydram in bangalore bus

karnataka police hydram in bangalore bus, karnataka polices, karnataka assembly election, bangalore bus checking, two bags,

karnataka police hydram in bangalore bus

తిరుపతిలో కర్ణాటక పోలీసుల హైడ్రామా

Posted: 05/03/2013 07:28 PM IST
Karnataka police hydram in bangalore bus

కర్ణాటక పోలీసులు వ్యవహరించిన తీరుతో హైడ్రామా చోటుచేసుకుంది. మదనపల్లె నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేట్ బస్సు బయల్దేరింది. పెద్దపంజాణి మండలం రాజుపల్లె చెక్‌పోస్టు వద్దకు బస్సు చేరుకోగానే అక్కడ కాపు కాసి ఉన్న కర్ణాటక పోలీసులు ఆపి సోదాలు చేశారు. బస్సులోని రెండు బ్యాగులను స్వాధీనం చేసుకుని పోలీస్ జీపులో ఉంచారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి విలేకరులు అక్కడికి చేరుకుని పోలీసుల అనుమతితో ఫోటోలు తీశారు. విషయం తెలుసుకున్న ఓ ఉన్నతాధికారి విలేకరులపై దౌర్జన్యం చేసి కెమెరాలు లాక్కొని అందులోని ఫోటోలను తొలగించారు. ఆ బ్యాగుల వద్దకు బస్సులోని ప్రయాణికులనుగానీ, విలేకరులను గానీ వెళ్లనివ్వలేదు. మరో రెండు రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడికి తరలించేందుకు భారీగా నగదు గానీ, పేలుడు పదార్థాలు కానీ బ్యాగుల్లో ఉంటాయని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పెద్దపంజాణి ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకునే లోపు కర్ణాటక పోలీసులు అక్కడి నుంచి జారుకోవడంతో అనుమానం మరింత పెరుగుతోంది. అయితే బస్సులో లభించిన రెండు బ్యాగుల్లోనూ జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయని మాత్రమే చెప్పినట్లు కొందరు చెబుతున్నారు. బ్యాగులను తీసుకెళ్తున్న బస్సును నంళి పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు సమాచారం. అయితే బ్యాగులు ఎవరివి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles