సాధారణంగా కొంతమంది తరచూ జ్వరానబారిన పడుతుంటారు. జలుబు, దగ్గు, హైఫీవర్, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటివి రోగాలు అప్పుడప్పుడు బాధిస్తుంటాయి. ఇటువంటి రోగాలు తరచుగా వచ్చేవారిలో రోగనిరోధక శక్తి తక్కువ మోతాదులో వుంటుంది. (కొంతమంది తమకు ఎలెర్జీ అంటూ చెబుతుంటారు. వాళ్లు తరచూ కర్చీఫ్ పట్టుకుని తిరుగుతుంటారు). పోషకపదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శక్తిని పెంచుకోవచ్చు గానీ.. తరుచుగా వచ్చే జబ్బులవల్ల శక్తి క్షీణిస్తూ వస్తుంది. పైగా రోగనిరోధక శక్తి తక్కువగా వున్నవారు బయటివాతావరణంలో తిరిగితే దాని ప్రభావం మరింతగా చూపుతుంది.
దుమ్ము, ధూళి, పోలెన్ వంటి అలెర్జెన్ ను పీల్చినప్పుడు హైఫీవర్, అలెర్జిక్ రినైటిస్ వంటి రోగాలు వస్తాయి. ఇవి ఒంట్లో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతాయి. ఈ యాంటీబాడీలు చాలావరకు హిస్టమైన్లుండే మాస్ట్ కణాలతో బంధం ఏర్పరచుకుంటాయి. పొలెన్, దుమ్ము, హిస్టమైన్ (ఇతర రసాయనాల) ద్వారా ప్రభావితమైనప్పుడు ఈ మాస్ట్ కణాలు విడుదలవుతాయి. ఇది దురద, వాపు, శ్లేష్మం ఉత్పత్తి వంటివాటికి దారితీస్తుంది. ఫలితంగా హైఫీవర్ తో మంచానపడాల్సి వస్తుంది. మరి ఇటువంటి రోగాలను తగ్గించుకోవాలన్న... దూరంగా వుండాలన్న కొన్ని సహజ మార్గాలను పాటిస్తే చాలు! త్వరలోనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
హైఫీవర్ ను తగ్గించుకునే సహజ మార్గాలు :
1. జ్వరం ఎక్కువగా వున్న వ్యక్తి చల్లని వాతావరణం వుండే ప్రదేశాల్లో వుంటే మంచిది. అలాగే పలుచటి దుస్తులు, దుప్పట్లు వాడాల్సి వుంటుంది. ఇలా చేస్తే.. కొంత ఉపశమనం లభిస్తుంది.
2. జ్వరం వచ్చిన వ్యక్తికి కొంతమంది నుదుటిపైన తడిగుడ్డ పెడతారు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అలాకాకుండా గోరువెచ్చని నీళ్ళతో శరీరమంతా తడుముకుంటే కాస్త ఉపశమనం లభిస్తుంది.
3. పోషకాలు ఎక్కువగా వుండే ఫ్రూట్ జ్యూస్, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నీళ్లను అధికంగా తాగితే మరీ మంచిది.
4. జ్వరం అధికంగా వున్నప్పుడు బయట ఎక్కువగా తిరగకుండా, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అలా అని గంటలకొద్దీ నిద్రపోకూడదు సుమా! ఇంట్లోనే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి.
5. జ్వరం వచ్చిన వ్యక్తి శక్తిని కోల్పోతాడు కాబట్టి ఆ సమయంలో అతని శరీరానికి అధిక కేలరీలు అవసరం అవుతాయి. కాబట్టి కేలరీలు ఎక్కువగా నిల్వవుండే గ్లూకోజ్, హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి. బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమైయ్యే పదార్దాలు ఇవ్వాలి. కాఫీ , టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి. పాలు, రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును.
7. అయితే మాంసం, గుడ్డు, వెన్న, పెరుగు, నూనె పదార్దాలు తీసుకోరాదు. ఒకవేళ వీటిని తీసుకుంటే జ్వరం ఇంకా ఎక్కువగా పెరగడంతోపాటు ఇతర వ్యాధులు సోకే ప్రమాదముంది.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more